ఎంపీ వద్దిరాజు ముఖ్య అతిథిగా హాజరు

ది ఖమ్మం గ్రానైట్ స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ 2024-26సంవత్సరాలకు గాను నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

గ్రానైట్ ఇండస్ట్రీకి ఖమ్మం జిల్లా నెలవు కావడం మనందరికి కూడా గర్వకారణమని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.ఇక్కడ లభించే గ్రానైట్ చాలా నాణ్యతతో కూడుకున్నదని, దీనికి దేశవిదేశాలలో కూడా మంచి గుర్తింపు ఉందన్నారు.

ది ఖమ్మం గ్రానైట్ స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ 2024-26 సంవత్సరానికి గాను నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఖమ్మంలోని ఏస్ ఆర్ గార్డెన్స్ లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీ

వద్దిరాజు మాట్లాడుతూ, ఢిల్లీలోని పోలీస్ అకాడమీకి 380టన్నులు, ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఈ జిల్లాకు చెందిన గ్రానైట్ నే ఉపయోగించిన విషయాన్ని గుర్తు చేశారు.ఇది మనకెంతో గర్వ కారణమన్నారు.గ్రానైట్ ఇండస్ట్రీ కారణంగా ఎటువంటి వాతావరణ కాలుష్యం ఉత్పన్నం కాదని,మరిన్ని రాయితీలు కల్పించి దీనిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉందన్నారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర తదితర ప్రముఖులను నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన అధ్యక్షులు యుగంధర్, ప్రధాన కార్యదర్శి గోపాల రావు, కోశాధికారి పరమేశ్వర రెడ్డి, ఉపాధ్యక్షులు షేక్ రియాజ్, రాంమూర్తిలు శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకట రమణ,శ్వేధన్, అనిల్ కుమార్, లాల్ ప్రతాప్, రవికుమార్, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version