శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి వినతి

మంచిర్యాల నేటిదాత్రి

ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో జి.కిషన్ రెడ్డి,(కేంద్ర పర్యాటక, సాంస్కృతి, పట్టణాభివృద్ధి) శాఖ మంత్రి వర్యులు గారికి వినతి పత్రం ఇచ్చిన శాలివాహన పవర్ ప్లాంట్ కార్మిక సంఘం నాయకులు, పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న కార్మిక చట్టం ప్రకారం కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించకుండా పవర్ ప్లాంట్ యజమాని మల్కా కొమురయ్య గారు మొండిగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు, అదేవిధంగా పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూ నిర్వాసితులు తక్కువ ధరలకు భూములు ఇచ్చి ఇప్పుడు ఫ్లాట్ మూసి వేయడం వల్ల అటు భూములు కోల్పోయిన ఇటు ఉద్యోగాలు కోల్పోయి భూ నిర్వాసితులు రోడ్డున పడ్డారని తెలిపారు, కంపెనీ భూముల ధరలు కోట్లల్లో పలకడంతో పవర్ ప్లాంట్ యజమాని కంపెనీ మూసివేసి భూములు అమ్ముకోవాలని దురుద్దేశంతో కంపెనీ మూసి వేయడం జరిగింది, ప్రతి కార్మికునికి 10 లక్షల రూపాయలు యాజమాన్యం నుంచి రావాల్సి ఉందని తెలిపారు, కార్మికుల సమస్యలు పరిష్కారం చేసి కార్మికులను ఆదుకోవాలని కోరడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో భారతీయ మద్దూర్ సంఘం జిల్లా అధ్యక్షులు లగిశెట్టి కమలాకర్, బి ఎం ఎస్ జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్, శాలివాహన పవర్ ప్లాంట్ కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్, కార్యదర్శి నిమ్మరాజుల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు ఎస్ ఆనందరావు, ఆసరి రాజయ్య, సిహెచ్.చందు,రేకల తిరుపతి, ఏం చందు, ఏ రాజయ్య, మరియు కార్మికులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version