రాత్రి పగలు రైతులకు తప్పని తిప్పలు
అధికారులు మాకు న్యాయం చేయాలంటూ బాధితుల ఆవేదన
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని జైపూర్,నర్వ, దుబ్బపల్లి, వెంకట్రావుపల్లి, రసూల్ పల్లి, గ్రామంలో రైతులు పొలాల దగ్గర ఏర్పాటు చేసుకున్న మోటార్లు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్తున్నారు.
గత కొన్ని రోజులుగా జైపూర్ మండలంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా రైతుల కంటికి కునుకు లేకుండా చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు పొలాల దగ్గర ఇంటి స్థలం దగ్గర వేసుకున్న బోర్లను మోటార్ పైపుల తో సహా దొంగిలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని బాధిత రైతులు, వాళ్ల గోడును జైపూర్ ప్రెస్ క్లబ్ పాత్రికేయులకు విన్నవించుకున్నారు. బాధిత రైతులు మాకు తగిన న్యాయం చేయాలని పోలీస్ అధికారులే మాకు దిక్కు అని రైతులు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఇంకెవరికి జరగకూడదని పోగొట్టుకున్న తమ మోటార్లను మాకు అప్పగించాలని త్వరలోనే నిందితులను పట్టుకొని మాకు తగిన న్యాయం చేయాలని జైపూర్ సాయి చరణ్, సమ్మయ్య నర్వ, భీమేష్ దుబ్బ పల్లి బాధిత రైతులు వేడుకుంటున్నారు