గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులకు గూడూరు బాలరాజుకు ఘనంగా సన్మానం

చేర్యాల నేటిధాత్రి…

చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి, పెద్దరాజుపేట గ్రామాల ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు గూడూరు బాలరాజుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అనంతరం పూల మొక్కను అందించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సిపిఐ మండల నాయకులు కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి ఎంపీటీసీగా 70 లక్షల నిధులు తెచ్చి గ్రామ అభివృద్ధికి పాటుపడ్డారు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు గూడూరు బాలరాజు మాట్లాడుతూ పోతిరెడ్డిపల్లి గ్రామానికి రుణపడి ఉంటాను అని అన్నారు. అనంతరం గ్రామపంచాయతీ ముందు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పల్లె రజిత, బట్టు మోహన్ రెడ్డి. సిఏలు, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *