అక్రమంగా గంజాయి అమ్ముతున్న ఇద్దరు నిందుతుల అరెస్ట్.

కిలో 270 గ్రాముల గంజాయి సీజ్.

గంజాయి సేవించిన, రవాణా చేసిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవు-వేములవాడ డిఎస్పీ నాగేంద్రచారి.

వేములవాడ రూరల్ నేటిధాత్రి

వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో గంజాయి నిందుతులకు సంబంధించిన అరెస్ట్ వివరాలు వెల్లడించిన డిఎస్పీ

గంజాయి నిందుతుల వివరాలు.

1.పరిగిపండ్ల అన్వేష్ అలియాస్ బన్నీ, తండ్రి ; వెంకటేశ్వర్లు , 26 సం,లు , నివాసం :అల్లూరి సీతారాంనగర్, మంచిర్యాల, మండలం, ప్రస్తుతం శాస్త్రి నగర్,వృత్తి; ఆటో డ్రైవరు, వేములవాడ.

2.మర్రిపల్లి సురేష్ తండ్రి :శ్రీనివాస్, 27సం.లు, ధోబి ,నివాసం :సుభాష్ నగర్ , వేములవాడ టౌన్ మండలం.

ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ….

అల్లూరి సీతారాంనగర్, మంచిర్యాల ప్రస్తుతం వేములవాడ పట్టణం శాస్త్రి నగర్ కి చెందిన పరిగిపండ్ల అన్వేష్ అలియాస్ బన్నీ మరియు వేములవాడ పట్టణం సుభాష్ నగర్ కి చెందిన మర్రిపల్లి సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు తేది 12.04.2024 న సాయంత్రం సుమారు 15.30 గంటల సమయంలో వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగాయపల్లి గ్రామం శివారులో రైతు వేదిక వెనుకాల ఇద్దరు వ్యక్తులు నిషేధిత గంజాయిని అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు వేములవాడ రూరల్ ఎస్.ఐ మారుతి తన సిబ్బంది తో అక్కడికి వెళ్లగా అక్కడ ఉన్న ఇద్దరు ఇద్ధరు వ్యక్తులు పోలీస్ వాహనాన్ని చూసి పారిపోవుటకు ప్రయత్నంచగా వెంటేనే ఎస్.ఐ తన సిబ్బందితో వారిని వెబడించి పట్టుకొని వారి వివరాలు అడుగగా 1.పరిగిపండ్ల అన్వేష్ అలియాస్ బన్నీ, తండ్రి ; వెంకటేశ్వర్లు , 26 సం,లు , నివాసం :అల్లూరి సీతారాంనగర్, మంచిర్యాల, మండలం, ప్రస్తుతం శాస్త్రి నగర్,వృత్తి; ఆటో డ్రైవరు, వేములవాడ. 2.మర్రిపల్లి సురేష్ తండ్రి :శ్రీనివాస్, 27సం.లు, ధోబి ,నివాసం :సుభాష్ నగర్ , వేములవాడ టౌన్ మండలం. అని చెప్పగా మొదటి వ్యక్తి తన చేతిలో ఉన్న బ్యాగ్ ఓపెన్ చేయగా టేప్ తో చుట్టబడిన గంజాయి ప్యాకెట్ ఉండగా 1 కిలో 270 గ్రాముల గంజాయిని సీజ్ చేసి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు గతంలో గంజాయి వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లో ఐస్ క్రీమ్ బండి నడిపే శ్యామ్ దివాకర్, కుమ్మరి మల్లికార్జున్ మరియు భాను లు అను వారి దగ్గర కొనుగోలు చేసి గంజాయి తాగడానికి అలవాటు పడి, వాళ్ళ దగ్గర గంజాయి కొని అమ్మగా వచ్చే డబ్బులతో బ్రతకావచ్చు అనే ఉద్దేశ్యంతో గంజాయి తాగుడుకు అలవాటు పడిన వేములవడ లోని సుబాష్ నగర్ కి చెందిన భూమేష్, అంబేడ్కర్ నగర్ కి చెందిన సచిన్ మరియు అగ్రహారం కి చెందిన సాయిల కు అమ్మేవారు. 3.శ్యామ్ దివాకర్, 4.కుమ్మరి మల్లికార్జున్, 5.భాను, 6.భూమేష్, 7.సచిన్ మరియు 8.సాయి లు పరారీలో ఉన్నారని వారిని త్వరలో పట్టుకోవడం జరుగుతుంది అన్నారు.

జిల్లాలో గంజాయి నిర్ములనకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందని, గంజాయి నిర్ములనలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, గంజాయి కొన్న, సేవించిన,రవాణా చేసిన,విక్రయించిన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా డిఎస్పీ గారు హెచ్చరించారు.జిల్లాలో గంజాయ కి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్ వారికి లేదా, డయల్100 కి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version