గుట్టుచప్పుడు కాకుండా భారీ బయో మందుల రవాణా.

ఒకే రైతు పేరుతో 500 ఎకరాలకు సరిపడే, మూడు లక్షల 40 వేల సరుకు రవాణా.

ఫెర్టిలైజర్ వ్యవస్థకు దెబ్బ తీసేతందుకు బయో కుట్ర.

గుర్తింపు అర్హత కలిగిన ఫెర్టిలైజర్ల పరిస్థితి ఏమిటి.

రైతులు బయోమందు వాడకంతో నష్టం వాటిల్లితే బాధ్యులెవరు.

అగ్రికల్చర్ అధికారులు ఎక్కడ, బ్రాహ్మణపల్లి భారీ బయో మందుల రవాణా అధికారుల దృష్టికి రాలేదా.!?

వ్యవసాయ శాఖ డే ఎ ఓ,ఏడిఏ, ఏ ఓ, లకు నేటి ధాత్రి పలుమార్లు సంప్రదించిన స్పందన కరువు.

మహదేవపూర్- నేటి ధాత్రి:

జిల్లాలో మహదేవ్పూర్ మండలం వ్యవసాయ నేత్రాన్ని కలిగి ఉండడం రైతులకు అర్హత నాణ్యత కలిగిన పురుగుల మందులకు బదులు బయో ఫెర్టిలైజర్ను అనుమతి లేకుండా నీరుగా రైతులకు వందల ఎకరాల బయో పురుగుల మందులను గుట్టు షాప్పుడు కాకుండా రవాణా చేయడం జరుగుతుంది. ఇలాంటి తాజా సంఘటన శనివారం రోజు వెలుగులోకి వచ్చింది. భారీ మొత్తంలో బయో మందులను తరలిస్తున్న ఆటో పలువురు అడ్డుకొని వివరాలు అడిగే ప్రయత్నం చేయడంతో నేరుగా రైతు పేరుతో పెద్ద మొత్తంలో బయో బంధువులను సరఫరా చేస్తున్నట్లు బయటపడింది.

గుట్టుచప్పుడు కాకుండా భారీ బయో మందుల రవాణా.

మహాదేవపూర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం నికి చెందిన ఓ రైతు పేరుతో ప్రగతి అగ్రి సైన్స్. మార్గో పవర్,ట్రెట్, అని బయో మందులు సుమారు 17 కాటన్ లలో 170 బాటిల్లను రవాణా చేయడం జరిగింది. ఈ మందుల ఖరీదు విలువ మూడు లక్షల 40 వేల రూపాయల తో కూడిన ఇన్వైస్ ను కూడా అందించింది. సాధారణ రైతుకు 500 కు సరిపడే పురుగుల మందు ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. ప్రగతి అగ్రి సైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే డైరెక్ట్ సేల్స్ ఫార్మర్లకు ఇలా అందిస్తుంది, ఒక సంస్థ తన మేనిఫ్యాక్చరింగ్ పదార్థాలను రైతుల వద్దకు చేర్చే ప్రక్రియ ఉంటుంది కదా, కంపెనీ అవుట్లెట్ లేదా ఫెర్టిలైజర్స్ ద్వారా ప్రస్తుతం రైతుకు సరిపడే ఒకటి లేదా రెండు బాటిల్లను మాత్రమే అందించే నిబంధనలు ఉంటాయి కానీ ఇలా నేరుగా రైతుకు బల్క్ లో వందల ఎకరాల బయో మందులను సరఫరా చేయడం చట్ట విరుద్ధం కాదా, ఈ వ్యవహారం అంతా చూస్తే గుట్టు చప్పుడు కాకుండా కొందరు కంపెనీ నుండి డైరెక్ట్ గా రైతులకు ఎలాంటి అర్హత లేకుండా ఇల్లీగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో బయో మందులు సరఫరా చేస్తూ, ఇటు రైతులకు అలాగే ఫెర్టిలైజర్లకు ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యవహరించడం జరుగుతుందని స్పష్టమవుతుంది.

ఫెర్టిలైజర్ వ్యవస్థకు దెబ్బ తీసేతందుకు బయో కుట్ర.

ఉమ్మడి మండలంలో సుమారు 42 ఫెర్టిలైజర్లు రైతులకు కష్టనష్టాల్లో పురుగుల మందులను అందిస్తూ రైతులకు తోడుగా నిలుస్తున్న క్రమంలో, బయో మందులు పంటలకు ఫెర్టిలైజర్ కన్నా ఎక్కువ దిగుబడి ఇస్తాయని కొందరు మాఫియాగా ఏర్పడి అమాయక రైతులను మోసం చేస్తూ నేరుగా రైతులతో మాట్లాడి లక్షల రూపాయల బయో బంధువులను రవాణా చేయడం జరుగుతుంది. దీనికి సాక్ష్యం నేడు బ్రాహ్మణపల్లి గ్రామానికి ఇలాంటి అర్హత నిబంధనలను పాటించకుండా నీరుగా నాలుగు లక్షల పైచిలుకు రూపాల మందుల భారీ కాటన్ల రవాణ చేయడమే సాక్ష్యం. రేపటి రోజు రైతులు బయో మందు మూజులో పడి లక్షల రూపాయల పంట నష్టం వాటిల్లితే దానికి బాధ్యులు ఎవరు. ఇలా మందులను నేరుగా రైతులకు సరఫరా చేసి అర్హత కలిగిన ఫెర్టిలైజర్ వ్యవస్థను నాశనం చేసే కుట్ర జరుగుతుందని చెప్పడంలో సందేహ పడాల్సిన అవసరం లేదు.

అగ్రికల్చర్ అధికారులు ఎక్కడ, బ్రాహ్మణపల్లి భారీ బయో మందుల రవాణా అధికారుల దృష్టికి రాలేదా.!?

భారీగా బయో మందుల రవాణా చేయడం, రైతుల వద్ద గుర్తుతెలియని బయోమాఫియా పేరుతో రైతులకు మోసం చేస్తున్న మాఫియా వ్యక్తుల వ్యవహారాన్ని, అక్రమంగా రైతుల వద్దకు తరలిస్తున్న వేల లీటర్ల బయో మందుల సరఫరా వ్యవహారాన్ని అగ్రికల్చర్ అధికారులు ఎందుకు దృష్టి సాధించడం లేదు, నేడు బ్రాహ్మణపల్లి గ్రామంలో పెద్ద మొత్తంలో బయో మందుల రవాణా జరిగినప్పటికీ అగ్రికల్చర్ శాఖ దృష్టికి ఎందుకు రాలేదు, ఒకవేళ అగ్రికల్చర్ శాఖ దృష్టికి వస్తే సంబంధిత వివరాలు కంపెనీ మరియు సరఫరా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకొని, బయో మందులను వ్యవసాయ శాఖ అధికారులు ఎందుకు సీస్ చేయలేదు, ఒకవేళ చర్యలు తీసుకుంటే దానికి సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడం వెనుక కారణం ఏమిటి. ఉదయం బ్రాహ్మణపల్లి గ్రామానికి చేరిన భారీ బయోమందుల వ్యవహారంపై నేటి ధాత్రి అగ్రికల్చర్ శాఖ అధికారులకు సమాచారం ఉందా లేదా లేక ఏదైనా చర్యలు తీసుకోవడం జరిగిందా, అని వివరాల కొరకు పలుమార్లు వ్యవసాయ శాఖ అధికారి మరియు క్షేత్ర సాయి అధికారితో పాటు జిల్లా అధికారికి కూడా సంప్రదించినప్పటికీ ఎవరు కూడా స్పందించలేదు. బల్క్ గా రైతు పేరుతో భారీగా బయో మందుల రవాణాను అగ్రికల్చర్ శాఖ చర్యలు తీసుకుంటుందా లేక ప్రోత్సహిస్తుందా అనేది వేచి చూడాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version