కేసుల విచారణలో పారదర్శకత, వేగవంతం చేయాలి

జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

కేసుల విచారణలో పారదర్శకత, వేగవంతం చేయాలని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు కోర్టు డ్యూటీ అధికారులు మరియు కోర్టు లైజన్ అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసుల విచారణలో పారదర్శకత, వేగం, మరియు న్యాయ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అలాగే, కోర్టు సంబంధిత రికార్డుల నిర్వహణ, సమన్లు, వారంట్లు అమలు చేయడం, మరియు కేసులపై సమయానికి నివేదికలు సమర్పించడం వంటి అంశాలపై అధికారులు దృష్టి సారించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.నేరస్థులకు కచ్చితంగా శిక్ష పడేటట్టు చూడాలని అన్నారు.
జిల్లా పోలీసుల పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన మార్గదర్శకాలు మరియు సలహాలను ఈ సమీక్ష సమావేశంలో వివరించారు.

ఈ కార్యక్రమంలో డీ ఎస్స్పీ వెంకటేశ్వర్లు, డీసీ ఆర్ బీ డీ ఎస్స్పీ రమణా రెడ్డి, వర్టికల్ డీ ఎస్స్పీ సుదర్శన్ మరియు ఇతర సిబ్బంది పి ఆర్ ఓ పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version