శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో గల మిషన్ భగీరథ అధికారు లచే గ్రామ మంచినీటి సహాయ కులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా మంగళవారం సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ మోటార్లు, ప్యానెల్ బోర్లు గురించి తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం మొత్తం నాలుగు రోజులు ఏర్పాటు చేయడం జరిగింది రెండవ రోజు(3/10/24) వాటర్ క్వాలిటీ గురించి,
మూడవ రోజు(04/10/24) చేతిపంప్స్ నిర్వహణ, నాలుగ వ రోజు (05/10/24)ప్లంబింగ్, పైప్లైన్ లీకేజీ నల్ల కనెక్షన్లు గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరగుతుంది. ఈ కార్యక్రమం లో మిషన్ భగీరథ అధికారి డి ఈ ఈ మధు కుమార్, ఏ ఈ ఈ ఇంట్ల వెంకటేష్ ఏ ఈ ఈ గ్రిడ్ వహీద్ ముఖ్య అతిథిగా ఎంపీడీవో ఫణి చంద్ర, ఎం పి ఓ రంజిత్ పాల్గొన్నారు.