పత్తి రైతును నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు

యదేచ్చగా రైతులను నిండా ముంచుతున్న పట్టించుకోని అధికారులు

నిత్య కృత్యంగా మారుతున్న చిల్లర దోపిడి

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తిని తీసుకచ్చే రైతులను స్థానిక వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నారు. అహర్నిశలు కష్టపడి రైతు పంటని పండించి పత్తి వ్యవసాయ మార్కెట్లో విక్రయించేందుకు తీసుకువస్తుండగా.. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు బిడ్డింగ్ సమయంలో పోటీపడి మరి.. బిడ్డింగ్ నిర్వహిస్తున్నట్లు చేస్తూ… అత్యధిక ధరలు పలుకుతున్నామనే నేపంతో ప్రతి రైతును సదరు రైతుకు తెలియకుండానే నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. మార్కెట్లో పోటీపడి బిడ్డింగ్ నిర్వహించే సమయంలో 7270 రూపాయలు ఒక వ్యాపారి పాట పాడగా మరో వ్యాపారి 7280 అని పాట పాడి సదరు పత్తిని దక్కించుకున్నప్పటికీ.. చివరికి ఆ రైతుకు దక్కేది 7250 రూపాయల రేటు మాత్రమే వేస్తున్నారు. ఇది నిత్య కృత్యంగా మారుతున్నప్పటికీ.. సదరు మార్కెట్ అధికారులు చూచిచూడనట్లు వ్యవహరించడం విస్మయాన్ని కలిగిస్తుంది. పత్తి ధరల్లో క్వింటాలుకు 30, 40 రూపాయల వ్యత్యాసంతో పాడిన పాటకు రైతుకు నిర్ణయించే ధరకు తేడా వస్తుండడం ఇదొక మార్కెట్లో వింత పరిస్థితులకు దాపురిస్తుంది. దీని పై ” నేటిధాత్రి ” ప్రతినిధి సంబంధిత అధికారులను, వ్యాపారులను ఇదేంటని ప్రశ్నిస్తే.. అది కామన్ అని చెప్పడం కోసమేరుపు. గత పది రోజులుగా మార్కెట్ నడిచిన సమయంలో సుమారు వెయ్యి క్వింటాళ్ళకు తగ్గకుండా రైతులు పత్తిని మార్కెట్ కు తీసుకొస్తున్నారు. ఈ లెక్కన ప్రతి క్వింటాకు 20 నుండి 30 రూపాయలు బిడ్డింగ్ ధరకు తక్కువ వేసి రైతుకు క్వింటాకు చెల్లిస్తుండడంతో.. సుమారు ప్రతి రోజు అన్నదాతలను మార్కెట్కు పత్తిని తీసుకొచ్చే పత్తి రైతును 30 నుండి 40 వేల వరకు రైతులను నిలువు దోపిడికి గురి చేస్తున్నారు. ఇది చూసేందుకు 20, 30 రూపాయల లాగా కనిపించిన.. ఏర్పడకుండానే ప్రతి రోజు పత్తి రైతులను సుమారు 30 నుండి 40 వేల వరకు వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నప్పటికీ… మార్కెట్ అధికారులు చూచి చూడనట్లు వ్యవహరించడం ఏంటని రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా మార్కెట్లో ప్రతి రోజు వారికి వరంగల్ మార్కెట్ ని ఆధారం చేసుకుని ఇక్కడ ధరలు నిర్ణయిస్తున్నట్లు చేయడమే కాకుండా పోటీని తట్టుకొని ఒక సిండికేట్ వ్యాపారం చేస్తుండడంతో.. ఆ రైతులకు అత్యధిక ధరలు పలకడం లోపల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో మాదిరిగా సిండికేట్ మాదిరిగా కాకుండా వ్యాపారులు పత్తి నాణ్యతను బట్టి ధరలు నిర్ణయిస్తే ఆ రైతులకు మరింత లాభం చేకూరే అవకాశం ఉంటుంది. ఈ అకాల వర్షాల నేపథ్యంలో పత్తి దిగుబడి తగ్గి అన్నదాతలు తము పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదో అనే ఒకవైపు దిగాలు చెందుతూనే.. తమ చేన్లలో పండిన పత్తిని విక్రయించేందుకు మార్కెట్కు తీసుకువస్తుండగా… వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న వ్యాపారులు ఈ విధంగా నిలువు దోపిడీ చేస్తూ…. ప్రతి రోజు వేలలో సంపాదించడం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ లో నిత్య కృత్యమైంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి. రైతులకు బిడ్డింగ్ సమయంలో నిర్వహించిన ధరలే వ్యాపారులు చెల్లించే విధంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత సంవత్సరం అక్టోబర్ 19 తారీకు నుండి పాలకవర్గం గడుపు ముగియడంతో మమ్ములను అడిగేవారు లేరనే ధైర్యంతో వ్యాపారులు సైతం తము ఆడిందే ఆటగా వ్యవహరిస్తుండడంతో రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా బిడ్డింగ్ నిర్వహించే సమయంలో మార్కెట్ అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసి బిడ్డింగ్ నిర్వహించిన ధరనే వారికి చెల్లించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు పేర్కొంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version