రైతులకు న్యాయం చేసేవరకు పోరాటం మరింత ఉధృతం చేస్తాం

బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోతె కర్ణాకర్ రెడ్డి

రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తాం

ఎకరాకు 15000/- రైతుబందు ఇవ్వాలి….

రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు గణపురం మండల కేంద్రంలో
మండల పార్టీ అధ్యక్షులు మోతే కర్నకర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తోందని, రైతులకు షరతులు లేకుండా ఎకరాకు 15000/- రైతుబంధు విడుదల చేయాలని, అందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని, అన్ని వడ్లకు 500 బొనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటం మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొలుసాని లక్ష్మీనరసింహ రావు, మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ లు నడిపెల్లి మధుసూదన్ రావు, తోట మానస శ్రీనివాస్, పెంచాల రవీందర్, కట్ల ప్రశాంతి – శంకరయ్య, పోతుల అగమ్మ, రామంచ భద్రయ్య,మాజీ ఎంపీటీసీ లు మంద అశోక్ రెడ్డి, దాసరి రవి, గ్రామ కమిటీ అధ్యక్షులు అల్లూరి శ్రీనివాస్, వైనాల వెంకటేష్,ఆకుల రాజ్ కుమార్, గాదె శేఖర్,ఎలబోయిన భద్రయ్య, సీనియర్ నాయకులు బైరగాని కుమారస్వామి, పీరాల దేవేందర్ రావు డా. జనయ్య, ఈర్ల సారయ్య, మార్త శ్రీను, అమరాజు తిరుపతి, పబ్బ రాము, ఆకుదారి పూర్ణచందర్, జలిగపు రవి, ఆకుల తిరుపతి, పొనగంటి విజయ, కోడారి ఓదెలు, మోటం సింహాచలం, యూత్ నాయకులు భరత్ రెడ్డి, గాజర్ల రాజు, వాజీద్, సాయిరాం, విష్ణు, హఫీజ్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version