అసెంబ్లి ఎన్నికల సందర్భంగా జిల్లాలో పటిష్ట బందోబస్తు

*బోయిని పల్లి మండల కేంద్రంలో పోలీస్

*బి ఎస్ ఎఫ్ సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్.

*జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు

*డి.ఎస్.పి నాగేంద్ర చారి

*రూలర్ సిఐ కృష్ణకుమార్

బోయినిపల్లి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజన్న సిరిసిల్ల పోలీసు సిబ్బందికి సహాయంగా బి ఎస్ ఎఫ్ రెండు కంపెనీల 200 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు రావడం జరిగింది. బుధవారం రోజున బోయినిపల్లి, విలాసాగర్, నీలోజుపల్లి, కొదురుపాక, వరకు కొనసాగిన ఫ్లాగ్ మార్చ్ వంటి కవాతుల్లో ఈ సందర్భంగా వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు సన్న హాలు చేస్తున్నామని ఇటువంటి శాంతి భద్రత సమస్యల సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని రాబోయే ఎన్నికలకు సంబంధించి జిల్లాకు 200 మంది బృందంతో కూడిన కేంద్ర బలగాలు వచ్చాయని త్వరలో మరిన్ని బలగాల వస్తాయని అన్నారు.శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇప్పటి నుండే క్రిటికల్ పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందని అన్నారు.జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లాలో మొత్తం 560 పోలింగ్ స్టేషన్స్ ఉండగా,ఇందులో 118 క్రిటికల్ స్టేషన్స్ గుర్తించడం జరిగింది అన్నారు.ఎవరైనా చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు సృష్టించాలని చూసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగిలే ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలి అన్నారు.ఈ ఫ్లాగ్ మార్చ్ లో బి ఎస్ ఎఫ్ కమాండెంట్, అడిషనల్ కమాండెంట్, వేములవాడ డిఎస్పీ నాగేంద్రచరి,సి.ఐ కృష్ణకుమార్, ఎస్.ఐ మహేందర్, పోలీస్ సిబ్బంది, బి ఎస్ ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version