# జిల్లా కలెక్టర్ ,రిటర్నింగ్ అధికారి పి. ప్రావీణ్య.
# ఏనుమాముల మార్కెట్ యార్డులో ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలన.
వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి :
నేడు వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరుగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి పి. ప్రావీణ్య తెలిపారు.సోమవారం ఏనుమాముల మార్కెట్ యార్డులో జరగనున్న ఓట్ల లెక్కింపు కేంద్రాలను డిసిపి రవీందర్, అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, సంధ్యారాణి, డిఆర్ఓ శ్రీనివాస్ లతో కలసి కలెక్టర్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కౌంటింగ్ సిబ్బందికి నిర్వహిస్తున్న ఆచరాత్మకమైన శిక్షణను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్లు లెక్కింపు సిబ్బంది,పోలీస్ బందోబస్తు మొత్తం 2500 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు తెలిపారు.7 నియజకవర్గాలకు లెక్కింపు ప్రక్రియ జరుగనున్నందున టేబుల్స్ ఏర్పాటు, సూపర్వైజర్లు,సహాయకులు,మైక్రో
అబ్సవర్లకు, రో ఇంచార్జిలకు నియజకవర్గం వారిగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి రెండో విడత ర్యాండమేజేషన్ ద్వారా విధులు కేటాయించిన కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 4 న ఉదయం 6 గంటలకు ఎన్నికల కౌంటింగ్ పరిశీలకుల సమక్షంలో తుది ర్యాన్డ మైజేషన్ నిర్వహించి ఆయా కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బందిని కేటాయిస్తామని ఆమె వివరించారు. రాజకీయ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నామని,గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను గాని సిబ్బందిని కాని ఎట్టి పరిస్థితిల్లో కౌంటింగ్ సెంటర్ లోనికి అనుమతించమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ రౌండ్ వారిగా ఎన్ కోర్ లో ఫలితాలు అప్లోడ్ చేయు విధంగా చర్యలు ఎన్ కోర్ సిబ్బందికి, ఐటి సిబ్బందికి శిక్షణ ఇచ్చి సన్నద్ధం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.