ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మూడంచెల భద్రత ఏర్పాటు జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి

4వ తేదీ జరగనున్న వరంగల్ ఎస్సీ పార్లమెంటు నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య తెలిపారు. సోమవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో జరగనున్న 108 భూపాలపల్లి నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓట్లు లెక్కింపులో సిబ్బంది, పోలీస్ మొత్తం 2500 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నట్లు తెలిపారు. భూపాలపల్లి నియజకవర్గానికి సంబంధించి 18 రౌండ్లు ఏర్పాటు చేశామని, 18 టేబుల్స్ కు విధులు నిర్వహించు సూపర్ వైజర్లు, మైక్రో అబ్సర్వర్స్, సమహక సిబ్బంది, డేటా ఎంట్రీ, ఎన్ కోర్ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. లెక్కింపు ప్రక్రియలో విధులు నిర్వహించు సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో
అబ్సవర్లకు, రో ఇంచార్జిలకు నియజకవర్గం వారిగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి రెండో విడత ర్యాండమేజేషన్ ద్వారా విధులు కేటాయించామని, 4వ తేది ఉదయం సాదారణ ఓట్లు లెక్కింపు ఎన్నికల పరిశీలకుల సమక్షంలో తుది ర్యాన్డ మైజేషన్ నిర్వహించనునట్లు ఆమె వివరించారు. రాజకీయ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నామని, గుర్తింపు కార్డులు లేని వ్యక్తులను గాని సిబ్బందిని కాని ఎట్టి పరిస్థితిల్లో కౌంటింగ్ సెంటర్ లోనికి అనుమతించమని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ రౌండ్ వారిగా ఎన్ కోర్ లో ఫలితాలు అప్లోడ్ చేయు విధంగా ఎన్ కోర్ సిబ్బందికి, ఐటి సిబ్బందికి శిక్షణ ఇచ్చి సన్నద్ధం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. విధులు కేటాయించిన సిబ్బంది 4వ తేది ఉదయం గంటలకు ఓట్లు లెక్కింపు కేంద్రానికి చేరుకోవాలని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి ఆర్డిఓ, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మంగిలాల్, సిబ్బంది మేనేజ్మెంట్ అధికారులు శామ్యూల్, అవినాష్,
ఈడిఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version