జిల్లా యువకులు క్రీడల్లో ముందుండాలి

యువత ఫోన్ లకు పరిమితం కాకూడదు గ్రౌండ్ లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి.

అకాల గుండెపోటు మరణాలకు వ్యాయామం లేకపోవడం కారణం అవుతుంది.

భూపాలపల్లి నేటిధాత్రి

యువత దురవాట్లకు పోకుండా వ్యాయామం, క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. బుధవారం రోజున భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫుడ్ బాల్ టోర్నమెంట్ క్రీడల పోటీలను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.మారుతున్నకాలంలో సగటు మనిషి వ్యాయంపై శ్రద్ధ చూపాలని కోరారు.క్రీడల్లో క్రీడాకారులు గెలుపు ఓటములు సహజమేనని, ఒడినవారు మళ్ళీ గెలుపు దిశగా అడుగువేయాలని కోరారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫుట్ బాల్ క్రీడాకారులను అభినందించి, ఆటను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటరాణి సిద్దు వైస్ చైర్మన్ కొత్త హరిబాబు గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ బి ఆర్ ఎస్ పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్ధన్ జడ్పీ వైస్ చైర్మన్ కల్లేపల్లి శోభ రఘుపతిరావు ఎంపీపీ లావణ్య మున్సిపల్ కౌన్సిలర్లు స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version