పరిశోధనలో తెలుగు ఆచార్యుల కృషి -స్ఫూర్తిదాయకం.

ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి. కేయూ పూర్వ వైస్ ఛాన్సలర్. 1967నుండి నేటి వరకు కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం ఆచార్యుల పరిశోధన కృషి సాహితీ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందని కాకతీయ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.గోపాల్ రెడ్డి అన్నారు. కేయూ తెలుగు విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సౌజన్యంతో సోమవారం కాకతీయ యూనివర్సిటీ సెనెట్ హల్ లో సదస్సు సంచాలకులు ఆచార్య బన్న అయిలయ్య అధ్యక్షతన జరిగిన కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు ఆచార్యుల సాహిత్య సేవ అనే అంశంపై రెండు రోజుల యు.జి.సి జాతీయ సదస్సు కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలుగు విభాగం పూర్వ ఆచార్యులు ఎంతో క్రమశిక్షణ, నిబద్ధతను కలిగి సాహిత్యంలోని అనేక ప్రక్రియల్లో రచనలు చేసి తెలుగు వాజ్మంయ ప్రపంచం లో కేయూ తెలుగు విభాగాన్ని సుసంపన్నం చేశారని తెలిపారు. వారి సాహిత్య కృషిని నేటి తరాలకే కాక భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయం అని పేర్కొన్నారు. అనంతరం సదస్సు ప్రారంభంకులు ఆచార్య సుప్రసన్నా చార్య మాట్లాడుతూ సాహిత్యాన్ని కొత్త కోణంలో వీక్షించి సమాజ చైతన్యానికి దోహదపడాలని కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం నుండి ప్రతి సంవత్సరం విమర్శిని అనే పరిశోధన సంచికను వెలువరించామని అన్నారు. అలా సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న తరుణంలో ప్రబంధాలను రెండు, మూడు పొరలుగా అధ్యయనం చేయాలనే విషయం బయటపడింది న్నారు. అనంతరం ఈ సదస్సులో కీలకోపన్యాసం చేసిన ఆచార్య కాత్యాయని విద్మహే మాట్లాడుతూ ఏదైనా బీజం చిన్నగానే ఉంటుంది. దాని వృత్తి , ప్రవృత్తిని బట్టి దాని ఎదుగుదల ఉంటుంది అలా చిన్నగా మొదలైన కేయూ తెలుగు విభాగాంలో మా గురువులు కవిత్వం, విమర్శ, పరిశోధనలో గట్టి పునాది వేసి ఆంధ్ర దేశంలో కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగాన్ని సాహితీ నిలయం గా తీర్చి దిద్దారని తెలిపారు. అలా ఒక వెలుగు వెలిగిన తెలుగు విభాగం భవిష్యత్తులో కూడా దేదీప్యమానంగా కొనసాగాలని ప్రస్తుత పరిశోధక విద్యార్థులు అధ్యయనాన్ని అలవర్చుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆచార్య బన్న అయిలయ్య మాట్లాడుతూ దేశం పట్టని కవి పండితులు గా పేరుగాంచిన తెలుగు విభాగం ఆచార్యులు ఇప్పటి వరకు నాలుగు వందల పది గ్రంథాలను వెలవరించారని అన్నారు. తెలుగు విభాగం ఆచార్యుల గ్రంథాలు వివిధ యూనివర్సిటీల్లో పాఠ్యాంశాలు గా, రిఫరెన్స్ గ్రంథాలుగా ఉండడం వారి కృషి తార్కాణం అని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా తెలుగు విభాగం పూర్వ ఆచార్యుల సాహిత్య కృషిని నేటి తరం విధ్యార్థులకు తెలియజేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య అనుమాండ్ల భూమయ్య, డాక్టర్ గంగు కిషన్ ప్రసాద్, సంగనభట్ల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేతవరపు రామకోటి శాస్త్రి, అమరేశం రాజేశ్వర శర్మ, కోవెల సుప్రసన్నా చార్య, పేర్వారం జగన్నాధం గారల కవిత్వం, విమర్శ, పరిశోధన పై పలువురు పత్ర సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మంథని శంకర్, డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ చింతం ప్రవీణ్, డాక్టర్ ఆగపాటి రాజ్ కుమార్, డాక్టర్ అన్నా పూర్ణ, డాక్టర్ కర్రె సదాశివ్ తదితర 200మంది విద్యార్థులు, కవులు, రచయితలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version