పట్టభద్రుల నోట — మల్లన్న మాట.!

అచ్చునూరి కిషన్
ములుగు జిల్లా ఇంఛార్జీ.

హన్మకొండ: ఏటూరునాగారం మండల కేంద్రము’లో పట్టభద్రులతో మాట్లాడుతూ….. మే 27,నా జరిగే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మీ అమ్యూల్యమైనా మొదటి (1) ప్రాధాన్యత ఓటు వేసి “తీన్మార్ మల్లన్న’ను” భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

అలాగే తీన్మార్ మల్లన్న పేద ప్రజల కష్టాలు తెలిసినా వ్యక్తి, నిరుద్యోగుల బాధలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల ఇబ్బందులు చూసిన వ్యక్తిగా, పేద,పిల్లల కష్టసుఖాల్లో అండగా నిలిచి వారికి అన్నితానై ఆసరాగా నిలిచినా వ్యక్తి మల్లన్న అని

గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు, రాచరిక, నియంత, కుటుంబ పాలనను నిత్యం తన క్యూ న్యూస్ వేదికగా ప్రజలను చైతన్య పరుస్తూ గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా నిలిచి అనేకమైనా దాడులు, అరెస్టులు, అక్రమ కేసులు, వంద రోజుల పై చిలుకు జైలు జీవితం గడిపినా కూడా ఎక్కడ, ఎవరికి లొంగకుండా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజల పక్షాన గొంతెత్తు కల్వకుంట్ల కుటుంబ పాలనను అంతం చేసేవరకు వెనకడుగు వేయకుండా ధీరుడిలా పోరాటం చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న’నే అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు.

ఇలాంటి పోరాట పటిమ, ప్రశ్నించేతత్వం ఉన్న తీన్మార్ మల్లన్న’కు మీరంతా అండగా నిలిచి మీ గొంతును చట్టసభల్లో వినిపించి, మీ అభివృద్ధి’యే ధ్యేయంగా పనిచేయాలంటే… రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించి ఆశీర్వాదిస్తారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బొల్లె రమేష్, సర్వేశ్, విక్రమ్, గౌతమ్, వంశీ, ప్రసాద్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version