జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి.

జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ డిమాండ్*

చిట్యాల, నేటి దాత్రి :

మంగళవారం రోజున జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన నిరసన తెలియజేయడం జరిగింది
ఈ సందర్భంగా జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లా దేశాయి పేటలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం సిగ్గు చేటన్నారు.తన బార్య సావిత్రి బాయ్ పూలే ద్వారా పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను అందించిన గొప్ప మేధావి అని కొనియాడారు. హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని తెలిపారు. మహానీయుల విగ్రహలను గతంలో ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించక పోవడం వల్ల ఈసంఘటన జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు వెంటనే దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గౌల్కోండ సురేష్ అంబేద్కర్ యువజన సంఘం మండల మాజీ అధ్యక్షుడు బొడ్డు ప్రభాకర్ మండల సహాయ కార్యదర్శి కనకం తిరుపతి బొట్ల ఆనందం నాయకులు నేరేళ్ళ సమ్మయ్య వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు రమేష్ రవి పోషయ్య తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *