గుండాల సీఐ రవీందర్, ఎస్ఐ రాజశేఖర్
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
దేశ ప్రజల రక్షణ కోసం పోలీసులు చేసే త్యాగం వెల కట్టలేనిదని గుండాల సీఐ రవీందర్, ఎస్సై రాజశేఖర్ అన్నారు. పోలీసులు ప్రజల ధన మానప్రాణాల రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పోలీసుల అమరుల త్యాగాలు ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని వారన్నారు. శనివారం గుండాల పోలీస్ స్టేషండ్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.