ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల భూమిక కీలకం.

# అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి.

నర్సంపేట,నేటిధాత్రి :

ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల భూమిక కీలకమని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి అన్నారు. నర్సంపేట ఆర్డీఓ కృష్ణవేణితో కలసి నర్సంపేట బిట్స్ కళాశాలలో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నర్సంపేట అసంబ్లీ సెగ్మెంట్ ప్రిసైడింగ్ (పి. ఓ),అసిస్టెంట్ ప్రిసైడింగ్ (ఏ.పి.ఓ)అధికారులకు ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోకసభ ఎన్నికలల్లో విధులు నిర్వహించే సిబ్బంది ఎలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవాలని చెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఎన్నికల శిక్షణలో భాగంగా తొలివిడత ట్రైనింగ్ ను అందజేయడం జరుగుతుందని, బ్యాలెట్,కంట్రోలింగ్ యూనిట్,వి.వి.ప్యాట్ ల అమరిక తదితర అంశాల గురించి అధికారులు సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలని అన్నారు. బాధ్యతయుతంగా, సమర్థవంతంగా విధులు నిర్వహించాలని 2వ, 3వ దఫా లలో శిక్షణ నిర్వహిస్తామని తెలిపారు. పి.ఓలకు సెక్టార్ ఆఫీసర్స్ పూర్తి సహకారం అందజేస్తారని పేర్కొన్నారు. ఎన్నికలలో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించుకోవాలని ఆదేశించారు.శిక్షణలో భాగంగా తొలి రోజు పి.ఓలు, ఏ.పి.ఓలు శిక్షణ పొందినట్లు అధికారులు వెల్లడిస్తు మరో 2 రోజులు శిక్షణ కొనసాగనున్నట్లు తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ లు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version