వైద్య ఆరోగ్య శాఖ లో ఫార్మసిస్ట్ ల పాత్ర కీలకం

డియం&హెచ్ఓ లు డా.సాంబ శివ రావు, డా.వెంకట రమణ

హన్మకొండ, నేటిధాత్రి:

తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసిస్ట్స్ అసోసియేషన్( టీ జి. పి ఏ )2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మరియు కేక్ కటింగ్ కార్యక్రమం వరంగల్, హన్మకొండ జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమం నకు హన్మకొండ జిల్లా అధ్యక్షులు కందకట్ల శరత్ బాబు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి హన్మకొండ, వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డా. బి. సాంబ శివ రావు,డాక్టర్. కె. వెంకటరమణ హాజరై మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఫార్మసిస్టుల పాత్ర చాలా కీలకమైనదని కొనియాడినారు. ఫార్మసిస్టులు పేషెంట్ కి డాక్టర్కు మధ్య వారధి లాంటి వారని, ఫార్మసిస్టులను ప్రభుత్వం వెంటనే ఫార్మసీ ఆఫీసర్లుగా గుర్తించాలని, ఫార్మసిస్టులకు ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీ జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్, హాజరై మాట్లాడు చూ నూతన ప్రభుత్వం కాంట్రాక్ట్ ఫార్మసిస్టులందరినీ త్వరలోనే రెగ్యులర్ చేస్తుందని, రాబోయే నూతన పిఆర్సి లో ఫార్మసిస్టులకు మంచి వేతనాలు రావడానికి కృషి చేస్తామని, ఫార్మసిస్టులకు సపరేట్ ఫార్మసీ డైరెక్టరేట్ ఏర్పాటుచేయుటకు కృషి చేస్తామని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వివిధ ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న ఫార్మసిస్టులు అందరికీ సమాన పనికి సమాన వేతనం రావడానికి కృషి చేస్తానని, ఇటీవల తొలగించబడిన ఫార్మసిస్టులు అందరినీ తిరిగి వేకెన్సీ పోస్ట్లలో భర్తీ చేయాలని,త్వరలోనే ఫార్మసిస్టుల సమస్యలన్నింటినీ గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశం లో హన్మకొండ జిల్లా ఫార్మసీ సూపర్ వైజర్ శ్రీమతి వి. పద్మజా దేవి, ఫార్మసీ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షులు,సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఫార్మసిస్ట్ ఉప్పు భాస్కర్ రావు, వరంగల్ జిల్లా అధ్యక్షులు డి. ప్రకాష్ రావు,వర్కింగ్ ప్రెసిడెంట్ టీ. సత్యం, జనరల్ సెక్రటరీ ఎ. వెంకట రమణ, కోశాధికారి అవినాష్,హన్మకొండ జిల్లా జనరల్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, కోశాధికారి సతీష్,మరియు హన్మకొండ, వరంగల్ జిల్లాల ఫార్మసిస్ట్స్ నాయకులు శైలజ, గోవర్ధన్, ప్రేమ్ సాగర్,సునీత, విజయ,సతీష్, సూరయ్య, వేణు, శ్రీదేవి, అజిత, సంతోష్,నాగేందర్ రెడ్డి, స్పందన,రమేష్, అనూష, ప్రభావతి,అంజి,అనిల్,వెంకన్న,సుదారాణి, సృజన, సరలా రాణి, శ్వేత,స్వాతి, అందరూ పెద్ద ఎత్తున పాల్గొని గౌరవ డి.యం. హెచ్. ఓ గారలకు శాలువ, పూల భోకే లతో ఘనంగా సన్మానం చేసి నూతన సంహాత్సర శుభాకాంక్షలు తెలిపి నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version