మొగుళ్లపల్లి నేటి ధాత్రి
మండలంలోని ముల్కలపల్లిలో యువకుడు తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న ఘటన మొగుళ్లపల్లి ఎస్సై బొరగల అశోక్ అందించిన సమాచారం మేరకు ముల్కలపల్లి గ్రామానికి చెందిన.
ఓనపాకాల రాజు, ( 21 ) ప్రైవేట్ ఎంప్లాయ్ కాగా , తన స్వగ్రామం ములుకలపల్లిలో ఫోన్ కనిపించకుండా పోవడంతో మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సై కి పిర్యాదు చేయగా తక్షణమే స్పందించిన ఎస్సై తన సిబ్బందితో కేవలం రెండు గంటల్లో మొబైల్ ఫోన్ వెతికి పట్టుకొని ఆ యువకునికి అప్పగించడం జరిగింది. అతి తక్కువ సమయంలో తన ఫోన్ వెతికి పట్టుకొని అప్పగించినందుకు యువకుడు ఎస్సై తో పాటు పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసాడు.
