నామా నాగేశ్వరరావు. ఖమ్మం నియోజవర్గంలోనే అత్యధిక మెజార్టీ రానుంది
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ప్రజా ఆదరణ ఇప్పటికే సర్వే ఫలితాలు తేల్చాయి
నామా నాగేశ్వరరావు విజయం కోసం ప్రతి బూత్ లెవల్ కమిటీ సభ్యుడు గడపగడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించాలి
అసెంబ్లీ ఎన్నికలు అయిన అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత
ఖమ్మం జిల్లా ప్రయోజనాల కోసం తనదైన స్థాయిలో పార్లమెంట్ వేదికగా కృషిచేసిన మహోన్నతమైన వ్యక్తి. నామా నాగేశ్వరరావు
ఎంపీ రవిచంద్ర వద్దిరాజు ఖమ్మం తెలంగాణ భవన్లో
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
ఖమ్మం కార్పొరేషన్ వన్ టౌన్. 3 టౌన్ బిఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీ సభ్యులతో ఖమ్మం జిల్లా.బి ఆర్ ఎస్. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు. అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ.ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, మాట్లాడుతూ. బూత్ కమిటీ సభ్యులకు డివిజన్ నాయకులకు, కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ విషయాలను దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఖమ్మం నగర మేయర్ నీరజ, సీనియర్ నాయకులు.ఆర్ జె సి కృష్ణ, వన్ టౌన్.3 టౌన్ కార్పొరేటర్లు మరియు డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, బూతులు కమిటీ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.