మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెంచరామి గ్రామంలోని(పురేడు గుట్ట) సమ్మక్క జాతర పనులను శనివారం రోజున పరిశీలించిన మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెంచరామి గ్రామంలోని
(పురెడు గుట్ట) వద్ద ఈనెల 21 నుండి 24 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది అధికారులు జాతర పనులైన.విద్యుత్తు, మంచినీటి సౌకర్యం, శానిటేషన్ మరియు పార్కింగ్ తదితర పనులను పూర్తిచేయాలని, అనంతరం మిగిలిన ఫినిషింగ్ పనులు రేపటితో పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట ,మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామయ్య,పంచాయత్ రాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ తిరుపతి , మిషన్ భగీరథ ఏఈ రంజిత్ పంచాయతి కార్యదర్శి ఎలియాస్ మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.