డోర్నకల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ జెండా ఎగరడమే లక్ష్యం

సోషల్ మీడియా వారియర్స్ ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి.

వై సతీష్ రెడ్డి రెడ్ కో చైర్మన్.

మరిపెడ నేటి ధాత్రి.

మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని డోర్నకల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మీటింగ్ ఒంటి కొమ్ము లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్ పార్టీలో కీలకంగా పని చేయాలి సోషల్ మీడియాలో ఇతర పార్టీలో చేస్తున్న పోస్టులపై వెంటనే స్పందించాలి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టి ఎస్ రెడ్కో చైర్మన్ బి ఆర్ ఎస్ పార్టీ షోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై. సతీశ్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలమంతా సోషల్ మీడియాదే,ప్రతి రాజకీయపార్టీ సోషల్ మీడియా వారియర్స్ ను గుర్తిస్తుంది. గౌరవిస్తుంది అందుకు నేనే ఒక ఉదాహరణ.. నాకు కార్పోరేషన్ చైర్మన్ వచ్చిందంటే కారణం సోషల్ మీడియా.వేలాదిమందికి క్షణాల్లో చేరువయ్యే.. సమాచారం చేరవేయగలిగే సోషల్ మీడియాను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోండి.
బిఆర్ఎస్ పార్టీని.మన ప్రభుత్వ పాలనను, ప్రవేశపెట్టిన పధకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి.సోషల్ మీడియా వారియర్స్ కు ఖచ్చితంగా మంచిరోజులు రాబోతున్నాయి. మీరు ఎంత కష్టపడితే అంత గుర్తింపు మీకు లభిస్తుంది,అది భవిష్యత్ లో ఎంతగానో లాబిస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్,గుడిపూడి నవీన్ రావు ,డోర్నకల్ బీఆర్ఎస్ యువనేత డిఎస్ రవిచంద్ర డోర్నకల్ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version