నడి కూడ,నేటి ధాత్రి:
పరకాల నియోజకవర్గం నడి కూడ మండల కేంద్రంలో మండల గౌడ జేఏసీ అధ్యక్షులు నారగాని రమేష్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 వ తారీఖున జరిగే భారీ బహిరంగసభను విజవంతం చేయడానికి పోస్టర్ ను జేఏసీ జిల్లా కన్వీనర్ డా,,చిర్ర రాజు, ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీ వైస్ చైర్మెన్ ఆముదాలపెల్లి మల్లేశం గౌడ్ ముఖ్య అతిధులుగా పాల్గొని ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ సందర్బంగా రాజు గౌడ్ మాట్లాడుతు గౌడ గీతా కార్మికులకు 10 లక్షల గౌడ బంద్ ఇవ్వాలని డిమాండ్ తో త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో వరంగల్ ఉమ్మడి జిల్లా నుండి గౌడ్ లకి అన్ని రాజకీయ ప్రధాన పార్టీలు ఏదైనా నియోజకవర్గం నుండి కచ్చితంగా ఎమ్మెల్యే స్థానం కేటాయించాలి ప్రమాదవశత్తు మరణించిన గీత కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వం 10 లక్షలు ఎక్స్గ్రేషియా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సొల్తీ కిరణ్ గౌడ్,
ఉమ్మడి వరంగల్ జిల్లా జేఏసీ కో కన్వీనర్ మార్క సునీల్ గౌడ్, గౌడ జేఏసీ కోఆర్డినేటర్ ఉమ్మడి జిల్లాల జేఏసీ కార్యదర్శి బుర్ర దేవేందర్ గౌడ్, గోపా నడి కూడ మండల అధ్యక్షుడు గోడిశాల రంజిత్ కుమార్, సర్వాయి పాపన్న మోకు దెబ్బ మండల అధ్యక్షుడు బొమ్మ అశోక్, గోడిశాల రవీందర్,నారగాని వెంకటయ్య, గుర్రపు సత్యనారాయణ, బొమ్మ వెంకటరాజం, బొమ్మ కోటి, నారగాని లక్ష్మీనారాయణ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.