కారేపల్లి నేటి ధాత్రి
సింగరేణి మండల కేంద్రం లో మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు పోతుల విశ్వేశ్వర రావు 75 వ పుట్టినరోజు సందర్భంగా సింగరేణి మండల మాల మహానాడు మండల అధ్యక్షుడు సోమందుల రాములు నాయకత్వం లో అంబేద్కర్ విగ్రహం వద్ద పివి రావు జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు నాయకులు తలారి చంద్రప్రకాష్ మాట్లాడుతూ పివి రావు ఆనాటి ప్రభుత్వాలు ఎస్సీ రిజర్వేషన్ అంటూ ఎస్సీలను విడదీసే ప్రయత్నం చేయడం జరిగింది. ఆరిజర్వేషన్లు వద్దంటూ రిజర్వేషన్ల పేరుతో దళిత కుటుంబాలని విడదియ్యెద్దంటూ దళితులందరూ కలిసి ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారందరూ కలిసి ఉంటేనే రాజ్యాధికారం వస్తుందని రాజ్యాధికారాన్ని రాకుండా ఆనాటి ప్రభుత్వాలు విభజించి పాలించు అనే విదంగా కుట్రలు చేయడం జరిగింది. కావున ఆ కుట్రని ఆనాడు గవర్నమెంట్ టీచర్ గా ఉన్న కీర్తిశేషులు పివి రావు మాల మహానాడు వ్యవస్థను స్థాపించి తన కుటుంబాన్ని సైతం జాతికి అంకితం చేసిన గొప్ప మహనీయుడు అంటూ వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఆయన చేసిన పోరాటాన్ని మనం కూడా చేయాలంటూ చంద్రప్రకాష్ అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మాల మహానాడు గ్రామ శాఖ నాయకులు కొక్కిలి యుగంధర్ చెవుల శ్రీనివాసరావు సోమందుల నాగరాజు తోట మల్ల సాయి చెవుల చందు సోమందుల వెంకటేశ్వర్లు తడికమల్ల నరేష్ నంద నూరి సురేష్ తలారి అనీల్ చెవుల అనీల్ చెవుల చంద్రశేఖర్ సోమందుల రఘుబాబు మైపా అనిల్ సోమందుల రఘుబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.