భూపాలపల్లి సీఐ డీ. నరేష్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బిఎస్ఎఫ్ బలగాలతో కలిసిభూపాలపల్లి రూరల్ గ్రామాలు గొర్లవీడు, కొంపల్లి గ్రామలలో సిఐ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామాల లోని ప్రధాన రహదారుల వెంట తిరుగుతూ ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారిలో ధైర్యాన్ని నింపే విధంగా ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలీసులు ఎల్లవేళలా ప్రజల కోసం పనిచేస్తారని అన్నారు. ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐలు సుధాకర్, ప్రసాద్ మరియు బిఎస్ఎఫ్ సిబ్బంది సివిల్ పోలీసులు పాల్గొన్నారు.