గులాబి గూటికి వలసల పర్వం

 

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలం చెందిన కాంగ్రేస్, బిజెపి, వైఎస్సార్ సిపి పార్టీల నుండి పలువురు కీలక నాయకులు భూపాలపల్లి శాసనసభ్యులు గండ వెంకటరమణ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. చేరిన వారిలో అరికిల్ల దేవయ్య (మైలారం),మారేపల్లి క్రాంతి కుమార్, వైయస్సార్ సిపి మండల అధ్యక్షుడు మారేపల్లి సుధాకర్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ రూరల్ జడ్పీ చైర్ పర్సన్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నాయకత్వంలో అందరూ కలిసికట్టుగా సాగాలని, సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి యొక్క యోగక్షేమాలలో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికలకు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ప్రతిఒక్కరూ కదలి రావాలని ప్రభుత్వం  చేసిన అభివృద్ధిని జరుగుతున్న సంక్షేమాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రం అశోక్, మాజీ జెడ్పిటిసి వంగాల నారాయణరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్, వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, మైలారం గ్రామ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్, ఎంపీటీసీ గడిప విజయ విజయ్, శాయంపేట ఉపసర్పంచ్ దైనంపెల్లి సుమన్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ దూదిపాల రాజిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మారేపల్లి దేవేందర్ రెడ్డి, డిటి రెడ్డి, మారేపల్లి మోహన్, మైలారం గ్రామ పార్టీ అధ్యక్షులు చల్ల శ్రీనివాస్ రెడ్డి, బాసాని శంకర్, కొమ్మలు సంతోష్ ,కుసుమ శివ, జూపాక శివ, మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version