కాంగ్రెస్ పార్టీ ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చింది

బీజేపీ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డి

మంథని :- నేటి ధాత్రి

మంథని కేంద్రం లోని బిజెపి కార్యాలయంలో జరిగిన భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా స్థాయి సంస్థాగత ఎన్నికల కార్యశాల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో
సంస్థగత ఎన్నికల పెద్దపల్లి జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్ అయ్యన్నగారి భూమయ్య, మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్ లో ఎన్నికల ద్వారా పోలింగ్ బూత్ కమిటీలను బూత్ అధ్యక్షులు ద్వారా మండల అధ్యక్షులను వారి ద్వారా జిల్లా అధ్యక్షులను ఎన్నుకునే ప్రక్రియ బిజెపి పార్టీలో కొనసాగుతూ వస్తుందని అదే విధంగా ఇప్పుడు కూడా ఎన్నికలు నిర్వహించ నున్నని పార్టీ పటిష్టత కోసం బూత్ స్థాయి లో నిర్మాణం అయినప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకొని పార్లమెంట్ వరకు పార్టీ పరిపుష్టత సాధిస్తుందని అందుకే ప్రతి కార్యకర్త సంస్థగత ప్రక్రియలో భాగస్వామ్యులు కావాలని తెలియ జేశారు.పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆచరణకు నోచుకోని హామీలను ఇచ్చి అధికారంలకు వచ్చిందని వాటిని ఎండగడుతూ డిసెంబర్ మొదటి వారంలో ప్రజా సమస్యలపై అసెంబ్లీ వారీగా యాత్రలు నిర్వహించనున్నమని గత పాలకుల పరిపాలనకు కాంగ్రెస్ పరిపాలనకు తేడా ఏమీలేదని పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైందని ప్రజా అభీష్టం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పై తిరుగుబాటు యాత్రలు చేపట్టనున్నమని తెలియజేశారు ఈ కార్యక్రమం లో
పెద్దపల్లి జిల్లా సభ్యత్వ నమోదు ప్రభారీ ఆర్ముళ్ళ పోచం. జిల్లా ఎన్నికల సహాయాదికారి క్యాతం వెంకటరమణ,పోల్సని సంపత్ రావు,రామగుండం అసెబ్లీ ఇన్చార్జి కందుల సంద్యారాణి,
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి,మెర్గు హనుమంత్ గౌడ్, మచ్చగిరి రాము,స్టేట్ కౌన్సిల్ సభ్యులు కొండపాక సత్యప్రకాష్, ఆదిరెడ్డి,మోహనరావు,నాంపల్లి రమేష్ మండల అధ్యక్షులు ,ఇన్చార్జి లు,నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version