వాపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ,ప్రదర్శన..
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి బచావో నినాదంతో వాపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం ఏఐటీయూసీ సిఐటియు కార్మికులు కలిసి గణేష్ చౌక్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ, మానవహారం ప్రదర్శన నిర్వహించారు.
వాపక్ష పార్టీలు నిర్వహించిన ఈ భారీ ర్యాలీకి ముఖ్యఅతిథిగా *ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముష్క సమ్మయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ముష్క సమ్మయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి బంద్ సాయిలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి సింగరేణినీ ఈ తెలంగాణ ప్రాంతంలో కనుమరుగు చేసేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని అన్నారు.సింగరేణి జోలికి వస్తే సహించేది లేదని వెంటనే సింగరేణిలో బొగ్గును వెలికి తీసే ప్రక్రియ సింగరేణికి ఇవ్వాలని వేలం వేయవద్దని అన్నారు,సింగరేణి నీ కాపాడుకోవడం కోసం పలు దఫాలుగా ఉద్యమాలు కొనసాగిస్తామని అవసరమైతే తెలంగాణ బంద్ కు కూడా పిలుపునిస్తామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.దానికోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు బాధ్యతగా నిలబడాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ, బొగ్గు గనుల శాఖమంత్రి కిషన్ రెడ్డి వేలంపాట నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో సింగరేణి గని కార్మికుల సమ్మె చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండంకు వచ్చినప్పుడు ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని దొంగ హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తామని, కార్మికులకు అండగా ఉంటా అని నమ్మబలికి ఈరోజు సింగరేణినే లేకుండా చేస్తున్నారని వారన్నారు.
గణేష్ చౌక్ నుండి అంబేద్కర్ కూడలి వద్ద పెద్ద ఎత్తున సుమారు 200 మందితో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించి మానవహారం చేపట్టడం జరిగింది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు ప్రజా సంఘాలు నినాదాలు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వాపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం ఏఐటీయూసీ నాయకులు సోతుకు ప్రవీణ్ కుమార్, జి శ్రీనివాస్, విజేందర్, క్యాథరాజు సతీష్, రామ్ చందర్, ఆసిఫ్ పాషా, వెలిశెట్టి రాజయ్య, ఆత్కూరి శ్రీకాంత్, దేవేందర్,రవికుమార్, రామ్ చందర్, తాళ్ల పోశం, నేరెళ్ల జోసెఫ్,రమేష్, లావణ్య, పద్మ,తదితరులు పాల్గొన్నారు