# చెన్నారావుపేట మండలంలో పల్లె దవఖానాలను ప్రారంభం.
# మొడల్ స్కూల్ లో డైనింగ్ హల్ కు భూమి పూజ.
# 79 కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన
# నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట నేటిధాత్రి :
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట మండలంలో గల కోనాపురం, పాపయ్యపేట గ్రామాల్లో నిర్మించిన (పల్లె దవాఖానలు) వైద్య ఆరోగ్య ఉప కేంద్రాలను సోమవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులకు సూచించారు.నూతన పల్లె దవాఖానలో,ఒపి రిజిస్ట్రార్,రికార్డు బుక్ లను పరిశీలిం చారు.అనంతరం పాపయ్యపేట పల్లె దవాఖానకు భూమిని తల్లిదండ్రులు ఉప్పరి సాయిలు,ఎల్లమ్మల జ్ఞాపకార్థంగా విరాళంగా ఇచ్చిన కుమారులు ఉప్పరి గంగులు, రామచందర్,నరసింహస్వామిలు అభినందించిన దొంతి ఘనంగా సన్మానించారు.
మోడల్ స్కూల్ డైనింగ్ హాల్ లో భూమిపూజ చేసిన ఎమ్మెల్యే దొంతి..
అమీనాబాద్ మోడల్ స్కూల్ లో నూతన డైనింగ్ హల్ కు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భూమి పూజ చేశారు.మోడల్ స్కూల్ లో రూ. 30 లక్షలతో నిర్మించనున్న డైనింగ్ హాల్ కోసం శిలాఫలకం వేసి ప్రత్యేక భూమి పూజ చేశారు.అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో 79 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కల్యాణ లక్ష్మీ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈకార్యక్రమాలలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, తహశీల్దార్ పాణికుమార్ , డిప్యూటీ డిఎం హెచ్ఓ డాక్టర్ ప్రకాష్ ,డాక్టర్ సరోజ, డాక్టర్ భవాని ,మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి,ప్రసన్న లక్ష్మీ , టిపీసీసి మెంబర్స్ పెండెం రామానంద్, సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు భూక్య గోపాల్ నాయక్,జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి,జిల్లా రైతు కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు సాదు మధుసూదన్ రెడ్డి,మండల వర్కింగ్ ప్రెసిడెంట్స్ సిద్దన రమేష్,తప్పేట రమేష్ ,మండల ఉపాధ్యక్షులు నన్నెబొ యిన రమేష్ యాదవ్,కేతిటి వీరారెడ్డి,బొంత శ్రీనివాస్,లక్క కుమార్,మజ్జిగ రాంబాబు, మంచాల సదానందం,యూత్ డివిజన్ ఉపాధ్యక్షులు రూపిక శ్రవణ్ కుమార్,జిల్లా నాయకులు పార్వతమ్మ,తుటి పావని,బండి పద్మ, ఆవుల రాములు, మండల రాములు, ఉప్పునుతుల లింగమూర్తి, కల్లెపు శేఖర్ తదిత రులు పాల్గొన్నారు.