ప్రజలకు సంక్షేమ పథకాలు అందివ్వడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్

భూపాలపల్లి నేటిధాత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ చర్చించి రైతులకు రైతు భరోసా కింద 12000 ఇందిరమ్మ భరోసా కింద ప్రతి కుటుంబానికి 12 వేల రూపాయలు కొత్త రేషన్ కార్డులు ఇస్తా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ జీవన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి హాజరైనారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుంది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వంటగ్యాస్ సిలిండర్ ధర 500 రూపాయలకే అందిస్తున్నాం సన్న వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇస్తున్నాం జీరో కరెంట్ బిల్లు 200 యూనిట్ల లోపు ప్రతి కుటుంబానికి అందిస్తున్నాం రైతులకు రైతు భరోసా పతి ఎకరానికి 12,000 రూపాయలను భూమిలేని పతి కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా 12 వేల రూపాయలను ఇవ్వనున్నాం అలాగే రేషన్ కార్డులు లేక గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు కానీ ఈనెల 24 నుండి పేదలకు నూతన రేషన్ కార్డులను ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందని వారు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి శ్రీధర్ బాబుకి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ చల్లూరి మధు కౌన్సిలర్ ముంజల రవీందర్ దాట్ల శ్రీనివాస్ తిప్పాల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version