పార్లమెంట్ అభ్యర్థి విజయమే కాంగ్రెస్ లక్ష్యం.

కాంగ్రెస్ ప్రభుత్వం లోనే అందరికీ సమన్యాయం.

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గాదే రమేష్ పటేల్.

రఘునాథపల్లి (జనగామ) నేటి ధాత్రి :-
వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కావ్య విజయం లక్ష్యంగా ప్రతి కార్యకర్త నాయకులు పనిచేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ పటేల్ జెడ్పిటిసి సభ్యులు బొల్లం అజయ్ మణికంఠ,మారుజోడు రాంబాబు,మండల అధ్యక్షులు కోళ్ల రవి గౌడ్ అన్నారు సోమవారం మేకలుగట్టు, వెళ్లి,రఘునాథపల్లి మండల్ గూడెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం విచ్చేయాలని వారు కోరారు. రానున్న రోజుల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయని వారు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం లోని బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరుగుతుందని వారు వివరించారు. ఆగస్టు 15 రైతులకు రుణమాఫీ ఏకకాలంలో అమలు చేయడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈనెల 24న బుధవారం వరంగల్ లో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని వారు కోరారు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని వారు తెలిపారు.. మాజీ ఎంపీటీసీ మల్కాపురం లక్ష్మయ్యగౌడ్, రాష్ట్ర నాయకులు మహమ్మద్ బోస్మియా,గాదె మహేందర్ రెడ్డియు రవి.ఎంపీటీసీ పేర్ని ఉషా రవి,సింగిల్ విండో చైర్మన్ చీమలపాటి రవీందర్ జి,కడారి రవి, రంగు రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version