క్వెంకట స్వామి గారి 94వ జయంతి ఉత్సవాలు ఘనంగా చేయడం జరిగింది

కాటారం నేటి ధాత్రి

ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి దుర్గం తిరుపతి మాట్లాడుతూ వెంకట స్వామి గారు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి గొప్ప నాయకుడు మరియు భారతదేశంలో కార్మిక శాఖ మంత్రిగా చేసి తనన గుర్తింపు పొందిన మహనీయుడు భారతదేశంలో చిన్న రాష్ట్రాలు ఏర్పాటులో వెంకట స్వామి గారు ఒకరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని మొట్టమొదటి నుండి ఆకాంక్షించిన వ్యక్తి అతని చివరి దశలో తెలంగాణ ఏర్పడడం లో తన వంతు కృషి ఎంతో ఉంది చాలా చిన్న స్థాయి నుండి కష్టపడి పైకి ఎదిగినటువంటి వ్యక్తి కాకా వెంకటస్వామి గారు ఈ మానేరు నది వాహక ప్రాంతంలో సింగరేణి అభివృద్ధి సంబంధించినటువంటి ఎంతో గొప్పగా చేసినటువంటి వ్యక్తి వెంకట స్వామి గారు ఈ ప్రాంతంలో వెంకట స్వామి గారు తెలియని వ్యక్తి అంటూ ఉండరు అతను పేద ప్రజలకు గుడిసెలు ఏపించినటువంటి వ్యక్తి అందుకనే అతని గుడిసెల వెంకటస్వామి అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు ప్రజలు అదేవిధంగా కాకా ఆని కూడా పిలవడం జరుగుతుంది. అతని చివరి దశలో రాష్ట్రపతిగా చేయాలని ఆలోచన ఉండే కాకపోతే దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అతనిని కానివ్వలేదు అతని ఆశయాలను కొనసాగిస్తూ గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ గారు కాకా ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలకు సాయం చేస్తున్నటువంటి వ్యక్తి తండ్రి ఆశయాలను ముందుకు కొనసాగించాలని కాకా ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అటువంటి మహానీయులు కడుపులో వివేక్ లాంటి గొప్ప వ్యక్తి జన్మించడం వారి ఆశయాలను కొనసాగించడం చాలా శుభ పరిణామం అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో రాబోయే ఎలక్షన్లలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుల గెలిచి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగాలని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి దుర్గం తిరుపతి, జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి పాగే రంజిత్ జిల్లా కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బండం మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు గంట అంకయ్య పూసల రాజేంద్రప్రసాద్, జాడి లక్ష్మణ్, ఉడుముల వెంకట్ రెడ్డి, కంకణాల మల్లారెడ్డి,బొంతల రవీందర్, రవి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version