మల్లయ్య బట్టు ను బదిలీ చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి: బొట్ల నరేష్

హన్మకొండ, నేటిధాత్రి:

రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాల ప్రభాకర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో నెలకున్న సమస్యలపై జిల్లా అధికారులతో పాటు గురుకులాల కార్యదర్శి సైతం పర్యవేక్షణ లోపించడం వలన విద్యార్థులకు మెరుగైన విద్య నాణ్యతమైన భోజనం అందించడం లేదు అని, మొన్న గురుకుల్ బోర్డు రాష్ట్ర అధికారుల నిర్లక్ష్యం వలన అర్హత సాధించి ఉద్యోగ అవకాశాలు కోల్పోయినరని డిసెంబర్ 16 తారీకు మరియు 06;03:2024 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ట్విట్టర్ ద్వారా సమస్యలు తెలియపరచడం అట్టి సమస్యపై స్పందించి నిన్నా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకులాల కార్యదర్శిగా మల్లయ్య బట్టు బదిలీ చేస్తూ నూతన మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల కళాశాల కార్యదర్శిగా సైదులు ను నియమించినందుకు ఏ బి ఎస్ ఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన మరియు జిల్లా కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్ సాయి బన్నీ సాయి అరుణ్ ప్రసాద్ రఘు శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version