శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండలంలోని కాట్రపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఒంటేరు రాజయ్య పూరి గుడిసె పై పిడుగు పడింది. అందులో ఉన్న సామాగ్రి కాలిపోయింది. అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం చుట్టుప్రక్కల కుటుంబాలు భయభ్రాంతుల కు గురయ్యారు. ఏం జరిగిందో తెలియని స్థితిలో ఆ క్షణంలో ఒక్కరి బిక్కిరి అయ్యారు. వారికి ఆ పిడుగు పాటు కు శరీరం ఒక్కసారిగా వేడెక్కి నట్లు అయిందని బాధితులు తెలిపారు. ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ సామాగ్రి కాలిపోవడం వల్ల కొంత నష్టం వాటిల్లింది. అధికారులు స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహాయం అందించాలని బాధితులు రాజయ్య వేడుకున్నారు.