ధర్మ సమాజ్ పార్టీ ప్రతిపాదించిన రాష్ట్ర చిహ్నాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించాలి

నడి కూడ,నేటి ధాత్రి:
ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు ఈరోజు నడికూడ మండల తహసిల్దార్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా మండల నాయకులు బుస్స తిరుపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తూ ఆస్థానంలో కొత్త చిహ్నం తీసుకురావాలని ప్రకటించడాన్ని గమనించాం, దీన్ని మేము స్వాగతిస్తున్నాము వివిధ పార్టీల నుండి సంస్థల నుండి కూడా ప్రతిపాదనలు తమ ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలుసుకున్నాము.అందులో భాగంగానే ధర్మ సమాజ్ పార్టీ నుండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిహ్నాన్ని ప్రతిపాదిస్తున్నాం.
మేము ప్రతిపాదిస్తున్న ఈ చిహ్నంలోని గొప్ప తనం ఏమిటంటే ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన ఉస్మానియా యూనివర్సిటీని మరియు దాని నుండి గౌరవ డాక్టరేట్ తీసుకున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ని ఈ చిహ్నం లో ఉంచాము. ఇది మన తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ ఎంతో గంభీరమైన విషయం మరియు అగ్రవర్ణ భూస్వామ్య పాలకవర్గంపై అణగారిన వర్గాల రాజ్యం కోసం హక్కుల కోసం యుద్ధం చేసిన పండగ సాయన్న,సర్దార్ సర్వాయి పాపన్న,సమ్మక్క,సారలక్క, ల చిత్రాలను కూడా ఈ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదిత చిహ్నంలో ఉంచాము.
ఈ ప్రతిపాదిత చిహ్నంలో ఉంచిన ఈ ఆరు చిత్రాలు సమాజంలో సమానత్వ భావననీ,పీడిత వర్గాల యోధుల పోరాట స్ఫూర్తి కనిపిస్తుంది భావితరాల తెలంగాణ ప్రజలకి స్ఫూర్తి అవుతుంది.తెలంగాణ వైభవోపేతమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అవుతుంది కాబట్టి ఈ చిహ్నాన్ని తమ ముందు ( తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముందు ) ధర్మ సమాజ్ పార్టీగా మేము ప్రతిపాదిస్తున్నము. తప్పకుండా దీనిని ఆమోదించి మీకు మీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పట్ల సమానత్వ భావన ఉందని తెలియజేయండి అని అన్నారు.ఈ కార్యక్రమంలో రత్నాకర్, మేకల ప్రవీణ్, దినేష్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version