త్వరలో తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు.

# పారదర్శకంగా సర్వే.. పాతవారికి కొనసాగిస్తూ కొత్త వారికి అవకాశం..
# నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.


# ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలెట్ ప్రాజెక్టు సర్వేను ప్రారంభించిన ఎమ్మెల్యే.
# నియోజకవర్గ వ్యాప్తంగా 10 గ్రామాలు,పట్టణంలో సర్వే ప్రారంభం.

నర్సంపేట,నేటిధాత్రి :

త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులకు తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందివ్వనున్నదని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట పట్టణంలోని 18 వ వార్డులో అలాగే దుగ్గొండి మండలంలో,ఇతర మండలాల్లో ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా నర్సంపేట పట్టణంలోని 18 వ వార్డులో స్థానిక కౌన్సిలర్ పెండెం లక్ష్మీ రామానంద్ అధ్యక్షతన కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ గత రేషన్ కార్డుకు ఇప్పుడిచ్చే కొత్త డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుకు ఒక ప్రత్యేకత ఉన్నదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఐనా తర్వాత రేషన్ కార్డులు కావాలని ఎదురుచూస్తున్న క్రమంలో కొంతమేర
ఆలస్యం ఐనప్పటికీ డిజిటల్ స్మార్ట్ కార్డులను ప్రారంభించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు.కొత్తగా తీసుకునే డిజిటల్ స్మార్ట్ కార్డు ఎటిఎం కార్డుల ఫోటోతో సహా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దొంతి పేర్కొన్నారు.రేషన్ కార్డులలో రాష్ట్ర,పట్టణ గ్రామ స్థాయిలో పద్ధతి క్రమంలో పొదపరిచి అందులో ఏవైనా లోటు పాట్లు ఉంటే పూర్తి స్థాయిలో సవరణ చేసి ప్రజలకు అందించాలని లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపటిందని ఎమ్మెల్యే తెలియజేశారు.నర్సంపేట నియోజకవర్గంలో 179 గ్రామాల్లో సర్వే చేస్తాం.ప్రస్తుతం డివిజన్ వ్యాప్తంగా 10 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా మొదలు పెట్టామని సర్వేను పారదర్శకంగా పూర్తి చేసి కార్డులు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఇందులో పాత రేషన్ కార్డులు ఉన్నవారికి కొనసాగిస్తూ కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా అవకాశం ఉన్నదని తెలిపారు.ఆధార్ కార్డు,రేషన్ కార్డ్,ఓటర్ ఐడి కార్డ్ లాగా కాకుండా అన్నిటిని కలిపి ఒక్కటే స్మార్ట్ కార్డుగా కుటుంబ డిజిటల్ కార్డ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని,అధికారులు ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రజల దృష్టికి తీసుకువెళ్లి చైతన్య పరచాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్,ఆర్డీవో కృష్ణవేణి,తాహసిల్దార్ రాజకుమార్,మున్సిపల్ కమిషనర్ ఈసంపల్లి జోనా,పీసీసీ సభ్యులు పెండెం రామానంద్,పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్,మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,కౌన్సిలర్లు ఎలకంటి విజయకుమార్,నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,దుగ్గొండి మండల పార్టీ అధ్యక్షుడు ఎర్రెల బాబు,దుగ్గొండి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ రెడ్డి,రెవెన్యూ అధికారులు,మున్సిపల్ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version