జైపూర్, నేటి ధాత్రి:
జైపూర్ మండల కేంద్రం జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రతినెల మూడవ శనివారం జరిగే తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి వివిధ గ్రామాల నుండి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆలిష్ మాధుర్య మాట్లాడుతూ విద్యార్థులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కనిపెడుతూ వారి ప్రవర్తనలోని మంచి చెడు విషయాలను ఉపాధ్యాయులతో పంచుకోవాలన్నారు.ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలలో వ్యాధుల బారిన పడకుండా విద్యార్థులు శుభ్రత పాటించే విధంగా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తద్వారా విద్యార్థుల చదువుకు అంతరాయం మేలు జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తన తో పాటు ఇంటి వద్ద చదువుకునే విధానమును సమావేశంలో తెలియజేస్తూ,పాఠశాలలోఉన్న సమస్యలు టాయిలెట్లు, డైనింగ్ హాల్ గురించి ప్రస్తావిస్తూ త్వరగా పూర్తి చేయించాలని కోరారు .ఈ సమావేశానికి విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అమ్మ ఆదర్శ పాఠశాల సభ్యులు పాల్గొన్నారు.