బుక్స్ ను అమ్ముతున్నారు చెత్తను పారేస్తున్నారు.

బుక్స్ ను అమ్ముతున్నారు చెత్తను పారేస్తున్నారు

పారిశుధ్యాన్ని మరచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు

ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల నేటి ధాత్రి:

 

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మాస్టర్ మైండ్ స్కూల్ బుక్స్ అమ్మడానికి ఒక షెటర్ కిరాయికి తీసుకొని దానికి అయ్యప్ప స్టేషనరీ అని పేరు పెట్టి పుస్తకాల వ్యాపారం చేస్తున్నారు. బుక్స్ అమ్మగా మిగిలిన చెత్తను గ్రామపంచాయతీ ట్రాక్టర్లు వెయ్యకుండా ఇష్టానుసారంగా పారేస్తున్నారు.చెత్తను గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో వేయకుండా రోడ్డుమీద వేయడం వల్ల ఆ చెత్తచెదారం ప్రక్కన ఉన్న వ్యాపారస్తుల షాపులోకి కొట్టుకొచ్చి ఇబ్బందికరంగా మారుతుంది. దీనిపై అధికారులు స్పందించి ఆ చెత్తను తొలగించి చెత్త పారబోసిన వారిపైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version