ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలి

# నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి 

నర్సంపేట ,నేటిధాత్రి :

వరంగల్,నల్గొండ,ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 

మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలుపుకు సహకరించాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పట్టభద్రులను కోరారు. నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై మండల పార్టీ అధ్యక్షులతో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుక నిత్యం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న అని పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో జరిగిన అరాచకలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు నుంచి నిజమైన జర్నలిస్టుగా ప్రజలకు వివరించిన తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి,ఖమ్మం నల్గొండ,వరంగల్,కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నియమించడం చాలా సంతోషకరం అని అన్నారు. దీనిలో భాగంగానే ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గంలో నుండి ప్రతి గ్రామంలో ఉన్న పట్టభద్రులను గుర్తించి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు సైనికుల పనిచేస్తూ తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్సీ ఓట్లు వేసే విధంగా సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాలయి శ్రీనివాస్, నర్సంపేట దుగ్గొండి,నల్లబెల్లి మండలాల అధ్యక్షులు బానోత్ లక్ష్మణ్ , ఏర్రెల బాబు,చిట్యాల తిరుపతి రెడ్డి,పలువురు నాయకులు,పట్టభద్రులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version