బాలాజీ విద్యా సంస్థలో వేసవి శిక్షణా శిబిరం

నర్సంపేట టౌన్, నేటిధాత్రి :

బాలాజీ విద్యా సంస్థలలో ఒకటైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు వేసవి సెలవుల్లో
ప్రత్యేకమైన శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణా శిబిరంలో భాగంగా యోగా, కరాటే, డాన్స్, అబాకస్, గేమ్స్ అలాగే చెస్,క్యారం, క్రికెట్, మొదలగు వాటిలో ప్రత్యేకమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి తెలిపారు.ఈ శిబిరంలో ప్రత్యేకంగా పిల్లల మానసిక సాంస్కృతిక వికాసానికై ప్రత్యేకంగా భగవద్గీత బోధన చేయడం జరుగుతుందన్నారు. వేసవిలో విద్యార్థులను సెల్ ఫోన్ కు దూరంగా ఉంచుతూ వారి మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి యోగా, కరాటే లాంటివి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ వనజ మాట్లాడుతూ పిల్లల వ్యక్తిత్వ వికాసానికి, శాశ్వత మానసిక అభివృద్ధికి భగవద్గీత బోధనా ఎంతో ఉపయోగపడుతుందని ఇలాంటి శిక్షణా శిబిరాలను తల్లిదండ్రులు వినియోగించుకుని వారి పిల్లల వ్యక్తిత్వ వికాసానికి మరియు మానసిక అభివృద్ధి కి దోహద పడాలని అన్నారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version