లక్షటిపేట్ (మంచిర్యాల) నేటిధాత్రి:
లక్షటిపేట్ మండలంలోని సూరారం గ్రామానికి చెందిన పాలమాకుల నారాయణ అనే 70సంవత్సరాల వృద్దుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఈనెల 16వ తారీకున రాత్రి మద్యం తాగి వచ్చి బార్యతో గొడవపడి బార్యపై చేయిచేసుకుని ఇంట్లో నుండి వెల్లి పొలం వద్ద పడుకుని తిరిగి మరుసటి రోజు ప్రొద్దున ఇంటికి వచ్చే సరికి బార్య పడుకొని బాధపడుతూ ఉండటం గమనించి మనస్థాపంతో తిరిగి పొలం వద్దకు వెల్లి పంటకు కొట్టె పురుగల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన కుమారునికి విషయం తెలిసి మంచిర్యాల మెడిలైఫ్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించగా పరిస్థితి విషమయించడంతో ఈరోజు కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మద్యహ్నం మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతునికి బార్య ఇద్దరు ఆడ పిల్లలు, ఒక కుమారుడు.
