మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నేటిదాత్రి:
ఈనెల 13 నుండి 16 వరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీ,బెల్లంపల్లి లో హోరా హోరీగా జరిగి సోమవారంతో ముగిసిన 9వ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ విద్యార్థులలో జోష్ నింపింది.
ఆద్యంతం క్రీడా స్ఫూర్తిని నింపిన ఈ స్పోర్ట్స్ మీట్ లోని వ్యక్తిగత అథ్లెటిక్స్ పోటీల్లో జాతీయ రికార్డులను సైతం నెలకొల్పడం విశేషం.
కాలేశ్వరం జోన్ లోని కుమ్రం భీం ఆసిఫాబాద్,మంచిర్యాల,పెద్దపల్లి,ములుగు జిల్లాలకు చెందిన 11 సాంఘిక సంక్షేమ బాలుర గురుకులాలకు చెందిన సుమారు 12వందల మంది విద్యార్ధులు పాల్గొన్నారు.
సోమవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కె. సమ్మయ్య హాజరయ్యారు. క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రీడలు మనిషిలోని దాగివున్న శక్తిని నైపుణ్యాన్ని వెలికితీస్తాయన్నారు.విద్యార్థులు అంకుటిత దీక్షతో క్రీడా మైదానంలో ప్రతి ఆటలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించడం అభినందనీయమన్నారు. నాలుగు రోజులుగా 1200 మంది విద్యార్థులను బెల్లంపల్లి సి ఓ ఈ క్రీడా మైదానం స్ఫూర్తిదాయకంగా చేసిందన్నారు. ప్రిన్సిపల్ ఐనాల సైదులు సిబ్బంది అహర్నిశలు కృషిచేసి 9వ జోనల్ గేమ్స్ ను సక్సెస్ చేయడం వారి మధ్య గల చక్కటి సమన్వయాన్ని నిరూపించిందన్నారు.
కార్యక్రమంలో ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.విద్యార్థులు ముగింపు మార్చి ఫాస్ట్ బాయ్ బాయ్ అంటూ చేతులు ఊపుతూ క్రీడా మైదానం నుండి సెలవు తీసుకోవడంతో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. అనంతరం ప్రిన్సిపల్ ఐనాల సైదులు అధ్యక్షతన జరిగిన ముగింపు కార్యక్రమంలో నాలుగు రోజుల పాటు జరిగిన క్రీడా విశేషాలను ప్రత్యేకతలను సభకు వివరించారు. అనంతరం ఒవరాల్ విజేతల వివరాలు దాసరి ప్రసాద్ తెలిపారు.
గెలుపొందిన విద్యార్థుల వివరాలు
అండర్ 14 విభాగంలో
కబడ్డీ విన్నర్స్ ఆసిఫాబాద్, రన్నర్స్ సిర్పూర్.
ఖో ఖో విన్నర్స్ మంథని, రన్నర్స్ జాకారం.
టెన్నికాయిట్ డబుల్ విన్నర్స్ జాకారం, రన్నర్స్ మంథని,
చెస్ సింగిల్స్ జె విష్ణు (మంథని) విన్నర్ , చక్రపాణి (కోటపల్లి) రన్నర్,
క్యారమ్స్ డబుల్ విన్నర్స్,సందీప్, కార్తీక్( అసిఫాబాద్) రన్నర్స్ శ్రీకాంత్, హర్ష (ఏటూరు నాగారం)
ఓవరాల్ ఛాంపియన్షిప్ మంథని( పెద్దపల్లి జిల్లా)
అండర్ 17 విభాగంలో
ఖో ఖో మంథని విన్నెర్స్, జాకారం రన్నర్స్,
వాలీబాల్ సిర్పూర్ విన్నర్స్, ఏటూరునాగారం రన్నర్స్.
బాల్ బ్యాడ్మింటన్ జాకారం విన్నర్స్, మంథని రన్నర్స్.
హ్యాండ్ బాల్ జైపూర్ విన్నర్స్, సిర్పూర్ రన్నర్స్.
ఫుట్బాల్ జైపూర్ విన్నర్స్ ,జాకారం రన్నర్స్.
టెన్నికాయిట్ డబుల్ జాకారం విన్నర్స్, మంథని రన్నర్స్.
చెస్ సింగిల్ పీ గౌతమ్ (ఆసిఫాబాద్) విన్నర్, జి గోపి (జైపూర్) రన్నర్
క్యారం డబుల్స్ కే రాజేష్ ,ఎం సుజిత్ (జాకారం) విన్నర్స్, కృష్ణ- శ్రీకాంత్ (కాసిపేట్) రన్నర్స్.
ఓవరాల్ ఛాంపియన్షిప్ జాకారం (ములుగు జిల్లా)
అండర్ 19 విభాగంలో
కబడ్డీ జాకారం విన్నర్స్, మంథని రన్నర్స్.
ఖో ఖో మంథని విన్నర్స్, జైపూర్ విన్నర్స్.
వాలీబాల్ కోటపల్లి విన్నర్స్ , జాకారం రన్నర్స్.
బాల్ బ్యాట్మెంటన్ సిర్పూర్ విన్నర్స్, ఏటూరు నాగారం రన్నర్స్.
హ్యాండ్ బాల్ జైపూర్ విన్నర్స్, మంత్రి రన్నర్స్.
ఫుట్బాల్ జైపూర్ విన్నర్స్ , జాకారం రన్నర్స్.
టెన్నికాయిట్ డబుల్ జాకారం విన్నర్స్, ఏటూరు నాగారం రన్నర్స్.
సింగిల్ జే మారుతి (ఆసిఫాబాద్) విన్నర్ జె. కృష్ణ బాబు( జాకారం) రన్నర్
క్యారం డబుల్స్. బి బన్నీ- బి జస్వంత్ (జాకారం) విన్నర్స్ ఆర్. అజయ్- జే సాయికుమార్( ఆసిఫాబాద్) రన్నర్స్.
ఓవరాల్ ఛాంపియన్షిప్ జాకారం)
ఆదిలాబాద్ రీజియన్ ఆర్సీఓ కొప్పుల స్వరూప రాణి 4 రోజులు దగ్గరుండి అన్ని ఏర్పాట్లను సమీక్షిస్తూ సలహాలు సూచనలిస్తూ నడిపించారు.
స్థానిక సిఓఈ ప్రిన్సిపల్ ఐనాల సైదులు విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన ప్రత్యేక మెనూ తయారు చేసి విద్యార్థులకు ఏ లోటు లేకుండా చూసుకున్నారు.
ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జిల్లాల కోఆర్డినేటర్స్ ఎస్ శ్రీనివాస్, పోలోజు బాలరాజు, రామల బాలభాస్కర్ లు జోన్లవారీగా ఇంచార్జ్ గా వ్యవహరించారు. అదేవిధంగా ప్రిన్సిపాల్స్ ఐనాల సైదులు,సంధ్యారాణి,ఊటూరి శ్రీనాథ్ ,ఊటూరి సంతోష్,లలితకుమారి, సౌదా వినోద్ పలు కమిటీలకు ఇన్చార్జెస్ గా ఉన్నారు.
పలు వేదికల్లో సీనియర్ పీడీలు రవి,శ్రీధర్,అల్లూరి వామన్ ,గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లను నిర్వహించారు.