నిరుద్యోగ సమస్యలపై ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేత

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి లడే శివ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యలపై ఎమ్మార్వో కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు తీగల భరత్ గౌడ్ విచ్చేశారుఆయనమాట్లాడుతూ నీళ్ళు – నిధులు – నియా మకాలు అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు నియామకాల విషయంలో నిరుద్యోగులు మోసానికి గురవుతున్నారనేది జగమెరిగిన సత్యం. గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపించినట్లుగానే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాలో నడుస్తూ హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుంది. ఈ మోసా లను ఎండగడుతూ తెలంగాణ యువత తరపున, నిరుద్యోగుల తరపున బీజేవైఎం గత కొన్ని సంవత్స రాలుగా పోరాటాలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఈ నియంతృత్వ ప్రభుత్వం కనీస స్పందన లేకుండా కాలం గడుపుతుంది. నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది. కావున మీరైనా ఈ నిరుద్యోగ సమస్యలను జిల్లా కలెక్టర్ గారి వద్దకు తీసుకెళ్ళమని వినతి పత్రం అందజేశారు.
బీజేవైఎం రాష్ట్ర శాఖ నిరుద్యోగుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రధాన అంశాలు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలి,గ్రూప్ – 2, గ్రూప్ – 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలి,25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలి, ప్రస్తుత డీఎస్సీ పరీక్ష తేదీలను మార్పు చేసి నూతన తేదీలను ప్రకటించాలి,అన్ని నియా మకాల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటా యించాలి.పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న G.O. No. 46ను వెంటనే రద్దు చేయాలి,
జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలి.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు రాయ రాకుల మొగిలి ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి భూత అధ్యక్షులు బాసాని నవీన్ కోమటి రాజశేఖర్ కడారి చంద్రమౌళి తదితరులున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version