సారా తయారు చేసే వారికి బెల్లం అమ్మితే కఠిన చర్యలు బైండోవర్ ఎక్సైజ్ సీఐ.

వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో కిరాణం వ్యాపారులు సారా తయారు చేసే వారికి బెల్లం అమ్మితే కఠిన చర్యలు తీసుకొని బైండోవర్ చేస్తామని ఎక్సైజ్ సీఐ వెంకటరెడ్డి తెలిపారు. ఎవరైనా 10 కిలోలు గాని ఐదు కిలోలు గాని బెల్లం అడుగుతే వారి యొక్క ఆధార్ సెల్ నెంబర్ తీసుకొని బెల్లం అమ్మకాలు జరపాలని సీఐ కిరాణం వారిని కోరారు పటికీ నవ సాగరం సారా తయారు చేసే వస్తువులు ప్రభుత్వం నిషేధించిందని పై అధికారుల అనుమతి తీసుకొని కేసు నమోదు చేసి తహసిల్దార్ ముందు బైండ్ వర్ చేస్తామని సీఐ హెచ్చరించారు తెల్ల బెల్లం అమ్మకాలపై పండుగలకు శుభకార్యాలకు తెల్ల బెల్లం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సహకరించాలని సీఐ కోరారు. గుట్టుచప్పుడు కాకుండా కార్లలో ఇతర వాహనాలలో నల్ల బెల్లం పటికి నవ సాగరం అమ్ముతున్నట్లు తన దృష్టికి వచ్చిందని సీఐ పేర్కొన్నారు . అలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీఐ హెచ్చరించారు.అర్ధరాత్రి డీసీఎంలు ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో ఆన్లైన్లో నల్ల బెల్లం తెప్పించి కిరాణం వ్యాపారులు అమ్ముతున్నారని తమ దగ్గర సమాచారం ఉన్నదని అలాంటి వారిపై ఆకస్మిక తనిఖీలలో సారా నిషేధిత వస్తువులు దొరికితే బైండ్ వర్ చేసి పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపుతామని సీఐ హెచ్చరించారు. బెల్లం సారా తయారు చేసే వారికి ఇచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని వారు బెల్లం అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేస్తామని సిఐ హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!