హసన్ పర్తి/ నేటి ధాత్రి
హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి భాగ్యమ్మ అనే మహిళ నుంచి 5100 విలువ గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మాట్లాడుతూ ఇలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.