శ్రీమార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలు

కరీంనగర్, నేటిధాత్రి:

మార్కండేయ స్వామి ఉద్భవించి ఏకోత్తర శత మార్కండేయులుగా వెలసి భావనా మహాఋషికి జీవం పోసి అయన ద్వారా ముక్కోటి దేవతలకు మాట రక్షణకై వారికి తగురీతి వస్త్రాలర్పించి గరుడ, గంధర్వయుని గణములు అనేకులు వరాలందించిన మూల పురుషుల చరిత్ర మనదని, మన జాతి సమైక్యతకై ప్రేమామరాగాలు వెదజల్లుటకై సనాతన ధర్మ రక్షణకై శ్రీమార్కండేయ స్వామి దీక్షలు వహించుటకై మాలాధారణ చేయవలయునవి మన పెద్దల సంకల్పమని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసంవత్సరము కూడా జనవరి 20న మార్కండేయ మాలాదారణ దీక్షలు ప్రారంభమవుతున్నాయని పద్మకుల రత్న చిలుక నరసప్ప పద్మశాలి గురుస్వామి తెలియజేశారు. ఈదీక్షలు మాఘ శుద్ధ తదియ శ్రీమార్కండేయ స్వామి జన్మదినము 1-2-2025 వరకు జరుగునని, ఈదీక్షలు లోక కళ్యాణార్ధమై ప్రపంచశాంతి కోరుతూ సమస్త మానవాళి, సర్వప్రాణులు, సుఖశాంతులతో పాడి పంటలతో భారతదేశం సుబిక్షంగా వుండాలని సనాతన దర్శరక్షణకై మాలాధారణ దీక్షలు చేయాలని, పంచపాండవులు అరణ్యవాస సమయంలో శ్రీమార్కండేయ మాలాధారణ దీక్షలు చేశారని, మరి ఎంతో మంది దేవి, దేవతలు, ఋషులు ఆచరించినటువంటి ఈదీక్షలు చిరంజీవి శ్రీమార్కండేయ స్వామి లోక కళ్యాణార్థమై ఎన్నో మహాయజ్ఞములు చేసెనని, శ్రీమార్కండేయ స్వామి మాలాధారణ జనవరి 20-12-2024 నుండి శ్రీ మార్కండేయ జన్మదినము 1- 2-2025 వరకు, వయస్సు, లింగ బేధం లేకుండా నలబై ఒకటి రోజులు మండలం, ముప్పై ఒకటి, ఇరవై ఒకటి, పదకోండు రోజుల దీక్ష వలన సంపూర్ణ ఆరోగ్యము, వ్యాపార అభివృద్ధి, ఉన్నత విద్య అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉపాధి అవకాశములు లభిస్తాయని, అర్థమాశని, అష్టమ శని, ఆపద మృత్యుదోషము, గ్రహబాధలు, రాహుకేతుల దోషము, కలహములు తొలిగిపోవునని, స్త్రీలు సంపూర్ణ సౌభాగ్యవతిగా, పిల్లలకు సంపూర్ణమైన ఉన్నత విద్య కలుగునని, ఈదీక్షలు కరీంనగర్ జిల్లా మాండవ్య నది తీరమున శివభక్త మార్కండేయ దేవాలయములో స్వీకరించవచ్చునని లేని యెడల దూర ప్రాంతాల వారు మీగ్రామాలలో జిల్లాలో ఏచోట మార్కండేయ దేవాలయంలో మార్కండేయ మాలాధారణ చేయవచ్చునని, లేని యెడల భావనఋషి భద్రావతి దేవాలయంలో కాని శివలింగం ఏచోట వుండునో అచ్చట మాలాధారణ దీక్ష ప్రారంభించవచ్చునని, దీక్షా సమయంలో స్త్రీలు, పురుషులు పసుపు వస్త్రములు ధరిచవలయునని, ఈదీక్షలు తల్లిదండ్రులు చేతగాని, పద్మబ్రాహ్మణ పౌరోహితుల చేతగాని దేవాలయములోని అర్థకుల చేతగాని, గురుస్వాముల చేతగాని మాలాధారణ దీక్షలు చేయగలరని, మాలాధారణ మూలమంత్రము (శ్రీ మార్కండేయ నమః) అని జంపించవలయునని, దీక్ష సమయంలో తల్లిదండ్రులను, అత్తమామాలను, గురువులను దర్శించుకోవలెనని, ఈదీక్ష విరమణ స్థలము కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, మాండవ్యునది తీరమున శివభక్త మార్కండేయ స్వామి దేవాలయ అంతర్జాతీయ శ్రీమార్కండేయ స్వామి ఆశ్రమ పీఠం మాలాధారణ ప్రాంగణములో దీక్షల విరమణ చేయవలయునని లేనియెడల దీక్షా విరమణ కాళేశ్వరము, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కోటి లింగాలు, యాదాద్రి యాదగిరి గుట్ట, కొమురవెల్లి, భద్రాచలం, జోగులాంబ, అనంతగిరి, విజయవాడ, రాజోలి (జహారాబాద్), రామప్ప (వరంగల్), సమ్మక్క- సారలమ్మ (మేడారం), వెయ్యి స్థంభాలు, జైనథ్ శ్రీలక్ష్మీనారయణ స్వామి ఆలయం, వివిధ ప్రాంతాలలో వున్న పుణ్య నదులలో స్నానమాచరించి దీక్షా విరమణ చేయగలరని మాలధారణ దీక్షా పూర్తి వివరాలకు చిలుక నర్సప్ప పద్మశాలి గురుస్వామి మార్గదర్శకులు సెల్ (వాట్సవ్) 9059671181ను సంప్రదించగలరని చిలుక నర్సప్ప ఒక ప్రకటనలో తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version