– నేను ఈ ప్రాంత బిడ్డను, ప్రజల పక్షాన నిలబడుతున్న
– కేటీఆర్ మాటలకు తీవ్రంగా మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
బి. ఆర్. ఎస్ పాలనలో జరిగిన ట్రాక్టర్, గొర్రెల, చేపల కుంభకోణం త్వరలో బయటికొస్తదని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం కేకే మహేందర్ రెడ్డి సిరిసిల్ల కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ….. కేటీఆర్ కు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల కష్టాలు పట్టవని అన్నారు. మీ నాయినా బెదిరిస్తేనే బేదరలేదని నీ తాటకు చప్పుళ్లకు భయపడతానా అని ఏద్దేవా చేశారు.కేటీఆర్ ది ఎప్పుడు నెగెటివ్ రోలే గా ప్రవర్తిస్తారని అన్నారు.నీ ధన, మందు ప్రభావానికి తట్టుకొని నిలబడ్డ నన్ను ప్రజలు ఆదరించారని తెలిపారు.నువ్వు ఈ ప్రాంతం బిడ్డవి కాదని,నేను ఈ ప్రాంతం బిడ్డనని, నాకెందుకు ఈ ప్రాంత బిడ్డలపై కక్ష ఉంటదని ప్రశ్నించారు. అధికారులు చట్టపరంగా చర్యలు చేపడితే పూసాలు కదులుతున్నాయని పేర్కొన్నారు.అందుకే ఫార్మలా ఈ రెసింగ్ విషయంలో పూటకో మాట మాట్లాడుతున్నాడని అన్నారు .తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర హీరో ల పై దాడులు చేసిన మీరు, సంధ్య థియేటర్ ఘటన హీరో పై ప్రేమ కురుపిస్తున్నారని విమర్శించారు.ప్రజల కోసం పాటుపడాలని కార్యకర్తలకు చెప్పాల్సింది పోయి, నేను మీ కోసం లాయర్లను పెడతానని అనడం సిగ్గు చేటన్నారు. కుంభకోణాలు లేనిదే మీ అకౌంట్ లోకి వెయ్యిల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. మీ పాలనలో గొర్రె లు, చేపలు,ట్రాక్టర్లు, ఇసుక, భూ కుంభకోణాలేనని ప్రజలు గమనించే గత సంవత్సరం డిసెంబర్ మాసంలో మీకు బుద్ది చెప్పారని ఇకనైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఏఎంసి సిరిసిల్ల చైర్మన్ వెలుముల స్వరూప, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని మునిత,టోనీ, బైరినేని రాము తదితరులు పాల్గొన్నారు.