వరంగల్ తూర్పులో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో పోచంమైదాన్ కూడలిలో అంబరాన్నంటిన సంబరాలు

కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించిన తూర్పు కాంగ్రెస్ శ్రేణులు

పెద్ద ఎత్తున హాజరైన కొండా అభిమానులు, తూర్పు కార్పొరేటర్లు,యూత్ కార్యకర్తలు, మహిళలు

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

వరంగల్ తూర్పులోని పోచమ్మ మైదాన్ కూడలి వద్ద కొండా దంపతుల ఆదేశాల మేరకు, డిసెంబర్ 9వ తేదీ సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్బంగా, కాంగ్రెస్ రాష్ట్ర యువ నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ 79వ జన్మదిన వేడుకల సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన గోపాల నవీన్ రాజ్ కేక్ కట్ చేసి, 500మందికి అన్నదానం చేశారు. కొండా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినందుకు, తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలుపుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఆరుగ్యారంటీల హామీ అమలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతుందని తెలిపారు. అనంతరం సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామీ, తూర్పు కార్పొరేటర్లు చింతాకుల అనిల్, ఎండి ఫుర్ఖాన్, ఓని భాస్కర్, కావేటి కవిత, కేడల పద్మ, గుండు చందన, ఉమా దామోదర్ యాదవ్, భోగి సువర్ణ, పోషలా పద్మ, వస్కుల బాబు, బాలినే సురేష్, మరియు తూర్పు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తోట వేణు, బస్వారాజ్ రాజ్ కుమార్, మీసలా ప్రకాష్, ఎలుగం సత్యనారాయణ, వసీమ్, సయ్యద్ మోసిన్, మబ్బు ప్రవీణ్, ఖుర్షిద్, జక్కం ప్రవీణ్, గడ్డమీది రాజేష్ గౌడ్, జన్ను రవి, కొల్లూరి మల్లేశం, నరిగే శ్రీను మరియు యూత్ నాయకులు సిలివేరు రాజు, రాజేష్, రాకేష్ రెడ్డి, అజార్, వినయ్ సోషల్ మీడియా విభాగం పల్లంకొండ హరి శ్రీరామ్, మహిళా నాయకురాళ్లు స్వప్న గౌడ్, స్రవంతి, తోట రాణి తదితరులు పాల్గొన్నారు.


మరోసారి బయటపడ్డ తూర్పు కాంగ్రెస్ వర్గ విబేధాలు

సోనియాగాంధీ జన్మదిన వేడుకల సందర్బంగా మరోసారి బయటపడ్డ తూర్పు కాంగ్రెస్ వర్గ విబేదాలు. అయేమయంలో కార్యకర్తలు? ఉదయం జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ ఆధ్వర్యములో కేక్ కట్ చేసిన ఎర్రబెల్లి స్వర్ణ, బస్వారాజు సారయ్య వర్గం. అదే ప్లేస్ లో మధ్యాహ్నం నవీన్ రాజ్ ఆధ్వర్యంలో కేకు కటింగ్ చేసి అన్నదానం చేసిన కొండా వర్గం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version